ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా చూడాలి
నిర్ణీత రూట్లలో సకాలంలో బస్సులు నడపాలి
నూతన బస్టాండ్ పరిశీలనలో మంత్రి అజయ్
ఖమ్మం, జూన్ 10: ఖమ్మం నూతన బస్టాండ్ను మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గురువారం సాయంత్రం ఆకస్మికంగా పరిశీలించారు. అటుగా వెళ్తున్న మంత్రి బస్టాండ్లోకి వెళ్లారు. అక్కడ కలియ తిరిగి సౌకర్యాల గురించి వాకబు చేశారు. ప్లాట్ఫాంలు, విద్యుత్ సౌకర్యం, బస్సుల వివరాల గురించి అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం టాయిలెట్లలోకి వెళ్లి శుభ్రతను పరిశీలించారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అక్కడి సిబ్బందికి సూచించారు. అప్పుడప్పుడూ ఆకస్మిక సందర్శన చేస్తానని, ఎప్పుడూ శుభ్రంగా కన్పించాలని సూచించారు. బస్ స్టేషన్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. లాక్డౌన్ సడలింపు సాయంత్రం 5 గంటల వరకు ఉన్న నేపథ్యంలో నిర్దేశిత రూట్లలో బస్సులను సకాలంలో నడపాలని ఆదేశించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, ఆర్టీసీ డీవీఎం సుగుణాకర్, డీఎం శంకర్, ఎస్ఎం రఘునాథ పాల్గొన్నారు.