నాల్గవ రోజు నానబియ్యం బతుకమ్మ
జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న వేడుకలు
పాల్వంచ, అక్టోబర్ 9 : దసరా, బతుకమ్మ పర్వదినాలను పురస్కరించుకుని వాడవాడలా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. బతుకమ్మ వేడుకల్లో భాగంగా నాలుగో నానబియ్యం బతుకమ్మను ఏర్పాటు చేసి గౌరమ్మకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాల్వంచ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. డ్వాక్రా మహిళలు, మున్సిపాలిటీలోని మహిళలు కోలాట నృత్యాలు ఆడారు. కార్యక్రమంలో పెద్దమ్మగుడి చైర్మన్ మహిపతి రామలింగం, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, టీఆర్ఎస్ నాయకులు ఎస్వీఆర్కే ఆచార్యులు, చింతా నాగరాజు, దాసరి నాగేశ్వరరావు, రమేశ్, మున్సిపల్ కమిషనర్ చింతా శ్రీకాంత్, శానిటేషన్ అధికారిణి వాణీకుమారి పాల్గొన్నారు.
ఘాట్ వద్ద అన్ని సౌకర్యాలు : చైర్పర్సన్
కొత్తగూడెం అర్బన్ : ఈ నెల 14న సద్దుల బతుకమ్మను నిమజ్జనం చేసేందుకు గోధుమవాగు ఘాట్ వద్ద అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. లైటింగ్, తాగునీటి సౌకర్యం, సౌండ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
కళాశాలలో వేడుకలు
సుజాతనగర్ : మండలంలోని అబ్దుల్ కలాం ఇంజినీరింగ్ కళాశాలలో బతుకమ్మలను అందంగా పేర్చి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఏవో శ్రీకాంత్, హెచ్వోడీలు బాబూరావు, మునీర్, ప్రతాప్, ఉపేందర్, మోహన్, టీపీవో దేవేందర్, అధ్యాపకులు మాలిని, మాధవి, శృతి, భారతి, లావణ్య, సౌజన్యం, డింపుల్, శివాని, నాగరాణి పాల్గొన్నారు.