సత్తుపల్లి రూరల్, ఏప్రిల్ 9 : లబ్దిదారుల ఇళ్లవద్దకే సంక్షేమ పథకాలు అందాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యమని దానిలో భాగంగా కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు నేరుగా పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండల పరిధిలోని రామగోవిందాపురం గ్రామానికి చెందిన కోపూరి భూలక్ష్మి కుమార్తె కల్యాణలక్ష్మి చెక్కును ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేరుగా ఆమె నివాసానికి వెళ్లి శుక్రవారం అందించి నూతన వస్ర్తాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరాలనే ఉద్దేశంతో కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలు నేరుగా ఇళ్లకు వస్తున్నాయన్నారు.
నిత్యావసర సరుకులు, ఆర్ధికసాయం : మండల పరిధిలోని రామగోవిందాపురంలో షేక్ మహ్మద్ పూరిల్లు గురువారం రాత్రి అగ్నిప్రమాదంలో కాలిపోవడంతో ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయన నివాసానికి వెళ్లి రూ.10 వేల నిత్యావసరాలు, రూ.5వేల నగదును ఆర్ధిక సాయంగా అందజేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం నుంచి రూ.8వేల చెక్కు, 25 కిలోల బియ్యాన్ని తక్షణసాయంగా అందజేశారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్రావు, సర్పంచ్లు మందపాటి శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరావు, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు యాగంటి శ్రీను, చల్లగుళ్ల నర్సింహారావు, గోగులమూడి బాలాజీరెడ్డి, ఖాసీమ్, అప్పారావు, తహసీల్దార్ మీనన్, ఎంపీడీవో చిట్యాల సుభాషిణి, ఆర్ఐ జగదీశ్ పాల్గొన్నారు.