ఎన్నికల్లో ఎలాంటి ఘటన జరిగినా ఆర్వోకు చెప్పాలి: సుదర్శన్రెడ్డి
మామిళ్లగూడెం, డిసెంబర్ 7: ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా సూక్ష్మ పరిశీలన చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సాధారణ పరిశీలకుడు సీ.సుదర్శన్రెడ్డి సూచించారు. ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో సూక్ష్మ పరిశీలకులు (మైక్రో అల్బర్వర్లు)కు మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీపీ గౌతమ్తో కలిసి సుదర్శన్రెడ్డి మాట్లాడారు. పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని సూక్ష్మస్థాయిలో పరిశీలన చేయాలని, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా వెంటనే సమాచారాన్ని అందించాలని సూచించారు. ఓటర్లు సైతం సీక్రసీ ఆఫ్ ఓటింగ్ను పాటించాలన్నారు. ఒక అభ్యర్థికి ఒక ఏజెంట్ను మాత్రమే అనుమతిస్తామన్నారు.