వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలి
పోక్సో కేసులపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ
ఫంక్షనల్ వర్టికల్స్ కోసం ట్రైనింగ్ ప్రోగ్రాం
నేర సమీక్షలో డీజీపీ మహేందర్రెడ్డి
మామిళ్లగూడెం, నవంబర్ 30: జిల్లాల్లో పెండింగ్ కేసులను త్వరగా పరిషరిస్తూ వాటి సంఖ్యను తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్రెడ్డి పోలీసు అధికారులకు ఆదేశించారు. సీపీలు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరంతర పర్యవేక్షణ ద్వారానే పెండింగ్ కేసుల్లో పురోగతి సాధ్యమవుతుందని అన్నారు. పోక్సో యాక్ట్, క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టిసారించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫంక్షనల్ వర్టికల్స్ అమలులో అధికారులు, సిబ్బంది ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. దీనికి అవసరమైన శిక్షణ తీసుకోవాలన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది సర్వీసుకు సంబంధించిన పూర్తి సమాచారం, వివరాలు, ఆన్లైన్ అప్లోడ్ ప్రక్రియ, హ్యుమానిటీస్ సోర్స్ మేనేజ్మెంట్ ఎంట్రీ తదితర అంశాలపై సమీక్షించారు. పెండింగ్ కేసులు, కేసుల డిస్పోజల్స్, కన్వెక్షన్కు సంబంధించిన ఆంశలపై చర్చించారు. వీసీలో ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ పెండింగ్ కేసులను సైతం క్లియర్ చేసే విధంగా ఏసీపీలు, సీఐలతో ఎప్పటికపుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. కేసుల సంఖ్యను మరింత తగ్గించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. డీసీపీ ఎల్సీనాయక్, ఏడీసీపీలు సుభాశ్ చంద్రబోస్, కే.ప్రసాద్, కుమారస్వామి, ఏసీపీలు ఆంజనేయులు, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.