పెనుబల్లి, జూలై 28 : దేశంలో సంక్షేమ పథకాలకు చిరునామాగా తెలంగాణ మారిందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. లబ్ధిదారులకు నూతన రేషన్కార్డులను బుధవారం పంపిణీ చేసి మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని నడిపించిన ఘనత కేసీఆర్దే నన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, జడ్పీటీసీల జిల్లా ఫోరం కన్వీనర్ చెక్కిలాల మోహన్రావు, ఎంపీడీవో కావూరి మహాలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్రావు, సర్పంచ్లు భూక్యా పంతులి, తేజావత్ తావూనాయక్, ఎంపీటీసీ చీపి లక్ష్మీకాంతం, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మందడపు అశోక్కుమార్, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు కనగాల సురేశ్బాబు, పాతకారాయిగూడెం సొసైటీ చైర్మన్ చింతనిప్పు సత్యనారాయణ, నీలాద్రి ఆలయ చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకటరావు, లక్కినేని వినీల్, సూర్యదేవర రవికుమార్, తాళ్లూరి శేఖర్రావు, తడికమళ్ల తాతారావు, మారేశ్వరరావు, ఆళ్ల అప్పారావు, తిరుమలశెట్టి నాగదాసు తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే సండ్రకు సన్మానం : సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను పంచాయతీ కార్యదర్శులు బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో సన్మానించారు. సంఘం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు హరీన్ చక్రవర్తి, ఎంపీవో వాల్మీకి కిషోర్, కార్యదర్శులు పాల్గొన్నారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కొణిజర్ల, జూలై 28 : ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ చల్లా మోహన్రావు కోరారు. తనికెళ్ల గ్రామంలో నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు బుధవారం అందజేసి మాట్లాడారు. గ్రామ ప్రజల తరపున సీఎం కేసీఆర్కు, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు మెంబర్ సైదా, గ్రామస్తులు పాల్గొన్నారు.