15 మంది పాత వారు..
36 స్థానాల్లో మహిళలు..
ఖమ్మం, మే 3: ఖమ్మం నరగపాలక సంస్థ ఎన్నికల్లో కొత్త కార్పొరేటర్లు అధిక సంఖ్యలో ఎన్నికయ్యారు. మొత్తం 60 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా వీరిలో 45 మంది కొత్త ముఖాలు ఉన్నాయి. పాత వారిలో నాగండ్ల కోటేశ్వరరావు, కొత్తపల్లి నీరజ, కూరాకుల వలరాజు, బిక్కసాని ప్రశాంతలక్ష్మి, ఆళ్ల నీరిష, కమర్తపు మురళి, పూనుకొల్లు నీరజ, కొప్పెర సరిత, ఎర్రా గోపి, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి, కర్నాటి కృష్ణమూర్తి, బీజీ క్లెమెంట్, శీలంశెట్టి రమా, దోరేపల్లి శ్వేత ఉన్నారు.
కొత్త కార్పొరేటర్లు వీరే..
ఈ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు తేజావత్ హుస్సేన్, మలీదు వెంకటేశ్వర్లు, మలీదు జగన్, దండా జ్యోతిరెడ్డి, పల్లెబోయిన భారతి, దొంగల సత్యనారాయణ, లకావత్ సైదులు, ఎస్కే జాన్బీ, చావా మాధురి, సరిపుడి సరిత, చిరుమామిళ్ల లక్ష్మి, రావూరి కరుణ, మేడారపు వెంకటేశ్వర్లు, దానాల రాధ, మందడపు లక్ష్మి, చామకూరి వెంకన్న, పల్లా రోజ్లీనా, మగ్బుల్, గోళ్ల చంద్రకళ , దొడ్డా నగేశ్ , గజ్టెల లక్ష్మి, ముక్కల కమల, దోనవాన్ సరస్వతి, ఎల్లంపల్లి వెంకట్రావ్, పసుమర్తి రామ్మోహన్రావు, ఎస్కే ఫాతిమా జోహ్ర, ఆలియా, మడూరి ప్రసాద్, దాదె అమృతమ్మ, పాకాలపాటి విజయ, పాలెపు విజయ, బుడిగం శ్రీను, కన్నం వైష్ణవి, మాటేటి అరుణ, తోట గోవిందమ్మ, దిద్దుకూరి వెంకటేశ్వర్లు, రాపర్తి శరత్, బుర్రి వెంకటేశ్వరరావు, పగడాల శ్రీవిద్య, మిక్కిలినేని మంజూల, ఎం.శ్రావణి, పైడిపల్లి రోహిణి, రఫిదా బేగం, బట్టపోతుల లలిత, ఆరెంపుల కొరివి.
నలుగురి ఓటమి..
కేఎంసీ గత కౌన్సిల్లో కార్పొరేటర్లుగా ఉండి ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు నలుగురు ఉన్నారు. వీరిలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పోట్ల శశికళ, పాలడుగు పాపారావు, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నాగండ్ల దీపక్చౌదరి, ఎర్రం బాలగంగాధర్ తిలక్ ఉన్నారు.
36 స్థానాల్లో మహిళలు..
కార్పొరేషన్ ఎన్నికల్లో 59 సీట్లకు ఎన్నికలు జరగ్గా వీరిలో 35 మంది మహిళలే ఎన్నిక కావడం విశేషం. అంతకుముందే 10వ డివిజన్ ఏకగ్రీవమైంది. మిగిలివారు రంగంలో ఉండి గెలుపొందారు. 60 డివిజన్లలో మహిళలకు 30 డివిజన్లు రిజర్లు కాగా.. అదనంగా మరో ఆరుగురు మహిళలు ఎన్నిక కావడం ఈ ఎన్నికల ప్రత్యేక. మేయర్ స్థానం కూడా జనరల్ మహిళకు రిజర్వేషన్ కావడంతో కౌన్సిల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నారు.