ఖమ్మం కల్చరల్, సెప్టెంబర్ 20: సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 25వ షోరూమ్ను ఖమ్మం జడ్పీసెంటర్లోని వీవీసీ టవర్స్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ‘ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి సోమవారం ప్రారంభించారు. తొలుత మంత్రి అజయ్తోపాటు వీవీసీ గ్రూప్ సంస్థల చైర్మన్ వీవీ రాజేంద్రప్రసాద్, సినీ నటి కృతిశెట్టి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, ఇతర ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ ఆధునిక జీవనశైలికి అనుగుణంగా సంప్రదాయ పద్ధతులను దృష్టిలో ఉంచుకుని నగరంలో షాపింగ్మాల్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. సినీ నటి కృతిశెట్టి మాట్లాడుతూ షాపింగ్ మాల్లో అనేక రకాల డిజైన్లు, ఆధునిక కలెక్షన్లతో ట్రెండ్కు అనుగుణంగా వస్ర్తాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీవీసీ సంస్థల చైర్మన్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సర్వాంగ సుందరంగా నాలుగు అంతస్తుల్లో షాపింగ్ మాల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్లు సురేశ్ శీర్ణ, రాకేశ్, కేశవ్ మాట్లాడుతూ ప్రారంభోత్సవ ఆఫర్గా కాస్ట్ టు కాస్ట్గా విక్రయిస్తున్నామని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మేయర్ నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, మురళి, పగడాల నాగరాజు పాల్గొన్నారు.