కార్పొరేషన్/కొత్తపల్లి, జనవరి 12: స్వామి వివేకానందుడి జీవితం యువతకు ఆదర్శనీయమని మేయర్ యాదగిరి సునీల్రావు పేర్కొన్నారు. నగరంలోని జ్యోతినగర్లో గల వివేకానంద చౌరస్తాలో గురువారం బల్దియా ఆధ్వర్యంలో వివేకానందుడి జయంతి వేడుకలు నిర్వహించారు. వివేకానందుడి విగ్రహానికి మేయర్తో పాటు మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్రావు మాట్లాడుతూ, వివేకానందుడి ఆశయాలను అనుసరించి యువత సన్మార్గంలో పయనించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. యువత అధికంగా ఉన్న దేశం మనదేనన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సామాజిక సేవలు చేసిన వారికి ప్రోత్సాహకాలు అందజేశారు. కార్పొరేటర్లు రాపర్తి విజయ, భూమాగౌడ్, జంగిలి సాగర్, నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.
కమాన్చౌరస్తా, జనవరి 12: భగత్నగర్లోని వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో యూత్ ఫెస్ట్ నిర్వహించారు. విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమురయ్య, ప్రిన్సిపాల్ ముథున్జై మిస్రీ, ఏవో సంపత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, వీహెచ్పీ ఆధ్వర్యంలో వివేకానందుడి జయంతి వేడుకలు నిర్వహించారు. వీహెచ్పీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సాధన పాఠశాలలో..
జ్యోతినగర్లోని సాధన సూల్ ఆఫ్ ఎక్స్లెన్స్లో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవానికి శాతవాహన లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ వీ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ ఎస్ మనోహరాచారి, అరవింద్బాబు, సీహెచ్ శ్రీనివాసరావు, సత్యనారాయణరావు, తిరుపతి రెడ్డి, తిరుపతి రావు, తదితరులు పాల్గొన్నారు. నగరంలోని వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో వివేకానందుడి చిత్రపటానికి ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ఆర్ గోపీకృష్ణ, ఏసీవో సంపత్, అలీఖాన్, శ్రావణ్కుమార్, రామేశ్వర్ రావు, అధ్యాపకులు పాల్గొన్నారు. అలాగే, బాలికల జూనియర్ కళాశాలలో ద లీడర్ నేతాజీ కపిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివేకానందుడి జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి, ఫౌండేషన్ బాధ్యుడుకపిల్ మాదవ్, అధ్యాపకులు రఖీబ్, మాధవి, లత, పూజ, సతీశ్ రెడ్డి, రామ్మోహన్, కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, జనవరి 12: జ్యోతినగర్లోని వివేకానందుడి విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ పూల మాల వేసి నివాళులర్పించారు. బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతి, నాయకులు ప్రశాంత్, రాజు పాల్గొన్నారు. అలాగే, వివేకానందుడి విగ్రహానికి రెడ్డి సంఘాల ఐక్య వేదిక నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సంఘం పట్టణాధ్యక్షుడు కిరణ్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, రాఘవ రెడ్డి, గోపాల్రెడ్డి పాల్గొన్నారు.
కొత్తపల్లి, జనవరి 12: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో వివేకానందుడి చిత్రపటానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్ పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగరంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న స్వచ్ఛంద సేవా సమితి నాయకుడు వొడ్నాల రాజును సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఉద్యోగులు శ్రీమతి, సరితారెడ్డి, నాగభూషణం, మల్లేశం, రాజమల్లయ్య, కవిత, గౌతమి, లక్ష్మి , తదితరులు పాల్గొన్నారు. అలాగే, కొత్తపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో హమ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సాగర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు జలజారాణి, సంస్థ సభ్యులు మహేందర్, సుధాకర్, శ్రీధర్రెడ్డి, వంశీ, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్లో భరోసా స్వచ్ఛంద సంస్థ సభ్యుడు అకినపల్లి నాగరాజుకు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మేయర్ సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, తదితరులు సేవా పురసారం అందజేశారు.
కరీంనగర్ రూరల్, జనవరి 12: నగర శివారులోని విట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీ, అడిషనల్ డైరెక్టర్ గోవిందరావు, ఏవో సుధాకర్, సిబ్బంది ప్రదీప్కుమార్, లక్ష్మణ్, స్టాలిన్, పవన్రావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, జనవరి 12: స్వామి వివేకానందుడిని యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. నగరంలోని నెహ్రూ యువ కేంద్రంలో నెహ్రూ యువ కేంద్రం, జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో వివేకానందుడి జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. యువత లక్ష్యాన్ని ఎంచుకొని సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా మండల యూత్ అవార్టీలకు సర్టిఫికెట్లు, యువజన సంఘాలకు వాలీబాల్, క్యారం బోర్డ్, క్రికెట్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవీ శ్యాం ప్రసాద్ లాల్, డీవైఎస్వో రాజవీరు, నెహ్రూ యువ కేంద్రం జిల్లా కో-ఆర్డినేటర్ వెంకటరాంబాబు, యూత్ అవార్డీలు ఎస్ శ్రీనివాస్, కిరణ్కుమార్, కళింగ శేఖర్, ప్రసాద్, కోచ్లు కిష్టయ్య, గణేశ్, పవన్, సాయికృష్ణ, క్రీడా శాఖ సిబ్బంది చంద్రశేఖర్, సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.