సిరిసిల్ల టౌన్/గంభీరావుపేట/ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్, నవంబర్ 30: సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్యూలో నిలుచున్నారు. వృద్ధులు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా తరలి వచ్చారు. 18 ఏండ్లు నిండి ఇటీవల ఓటు హక్కును పొందిన యువతీ, యువకులు మొదటి సారి తమ ఓటు హక్కును వినినియోగించుకుని ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని గీతానగర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకుడు బొల్లి రామ్మోహన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సాయంత్రం 5గంటల తరువాత పోలింగ్ కొనసాగింది. సమయానికి ముందే పోలింగ్ సెంటర్లోకి వచ్చిన వారిని అధికారులు ఓటింగ్కు అనుమతినిచ్చారు. గంభీరావుపేట మండలం గజసింగవరంలో నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న పోలింగ్ సరళిని కొండూరి పరిశీలించారు. కొత్తపల్లిలో ఎంపీపీ వంగ కరుణ, గోరంటాలలో జడ్పీటీసీ విజయ, శ్రీగాధలో సెస్ డైరెక్టర్ గౌరినేని నారయణరావు, దమ్మన్నపేటలో ఏఎంసీ చైర్మన్ కొత్తింటి హన్మంతరెడ్డి, మండల కేంద్రంలో జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు అహ్మద్, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో ఉదయం వేగంగా జరిగిన పోలింగ్ మధ్యాహ్నం కల్ల మందకోడిగా సాగింది.
నూతనంగా ఓటు హక్కు వచ్చిన యువతీ, యువకులు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు గురువారం పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించు కున్నారు. పోతుగల్కు చెందిన విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారి కుటుంబసభ్యులతో కలసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పోతుగల్లో ప్రముఖ వాపారవేత్త తన్నీరు శ్రీనివాస్రావు, బీఆర్ఎస్ సీనియర నాయకుడు వెన్నమనేని పూర్ణచందర్రావు, (చందు) వెన్నమనేని శ్రీనివాస్రావు, ఏఎంసీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, సపహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు, సర్పంచ్ తన్నీరు గౌతంరావు, మద్దికుంటలో ఎంపీపీ జనగామ శరత్రావు, ఆవునూర్లో జడ్పీటీసీ గుండం నర్సయ్య, మోహినికుంటలో కల్వకుంట్ల గోపాల్రావు, మొర్రాయిపల్లెలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
వీర్నపల్లి, నవంబర్30: మండలంలో 11,370ఓటర్లుండగా, 8,968 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో 4,254 పురుషులు, 4,714 మహిళలు ఓటు వేశారు. 78.87శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. బావుసింగ్నాయక్తండాలో జడ్పీటీసీ గుగులోత్ కళావతి, బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగులోత్ సురేశ్నాయక్, మద్దిమల్ల తండాలో ఎంపీపీ మాలోత్ భూల, అడవిపదిరలో ఆర్బీఎస్ మండలాధ్యడు ఎడ్ల సాగర్, బీఆర్ఎస్ మండలాధ్యడు గుజ్జుల రాజిరెడ్డి, వీర్నపల్లిలో సెస్ డైరెక్టర్ మాడ్గుల మల్లేశం ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సిరిసిల్ల రూరల్, నవంబర్ 30: తంగళ్లపల్లి మండలంలో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తన స్వగ్రామమైన కస్బెకట్కూర్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. గులాబీ షర్టు ధరించి ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. కోరుట్లపేటలో నవతేజ్ ఇన్ఫ్రాస్టక్చర్ చైర్మన్ గండ్ర యాదగిరి రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బస్వాపూర్లో జడ్పీటీసీ పుర్మాణి మంజుల-రాంలింగారెడ్డి దంపతులు తమ కూతురితో కలి సి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తంగళ్లపల్లిలో ఎంపీపీ పడిగెల మానస-రాజు దంపతులు, మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, మండెపల్లిలో సింగిల్విండో చైర్మన్ బండి దేవదాస్గౌడ్, జిల్లెల్లలో ఏఎంసీ చైర్పర్సన్ పూసపల్లి సరస్వతి-రామచంద్రం దంపతులు తమ కు టుంబసభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లెల్లలో సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చెన్నమనేని వెంకట్రావు, కస్బె కట్కూర్లో సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు వలకొండ వేణుగోపాలరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇల్లంతకుంట, నవంబర్ 30: మండలవ్యాప్తంగా మొత్తం 38,096 ఓటర్లుండగా, 29 పోలింగ్ కేంద్రాలు, 58 బూత్లు, 140 మంది ఎన్నికల సిబ్బందిని ఏర్పాటు చేశామని ఎస్ఐ దాస సుధాకర్ అన్నారు. మండలంలో 85.42 శాతంతో 32,453 ఓట్లు పోలయ్యాయన్నారు. అన్ని గ్రామాలలోని పోలింగ్ కేంద్రాల వద్ద గడ్డి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గాలిపెల్లిలో రాష్ట్ర ఆహార భద్రత కమిటీ సభ్యుడు ఓరుగంటి అనంద్ కుటుంబసభ్యులతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పొత్తూరులో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సోమారంపేటలో ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, మండల కేంద్రంలో ఏఎంసీ చైర్మన్ మామిడి సంజీవ్, గాలిపెల్లిలో సెస్ డైరెక్టర్ మల్లుగారి రవీందర్రెడ్డి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.
సిరిసిల్ల రూరల్, నవంబర్30: తంగళ్లపల్లి మండలంలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. మండలంలోని 30 గ్రామాల్లో 37,880 మంది ఓటర్లు ఉండగా, 30,594 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. తంగళ్లపల్లిలో పోలింగ్ కేంద్రంలో ఈవియం మోరాయించింది.పోలింగ్ కేంద్రంలో ఈవియంల మోరాయించడంతో మందకొడిగా పోలింగ్ సాగింది. అధికారులు ఈవియంలను సరిచేయడంతో పోలింగ్ కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగింది. పోలింగ్ సరళిని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పలు గ్రామాల్లో సందర్శించి,పార్టీ నేతలతో చర్చించారు.