Murder | పాలకుర్తి : పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామంలో బౌతూ సుమలత అనే యువతిని మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. పుట్నూరు గ్రామానికి చెందిన సుమలత గ్రామంలో మేకల కాపరిగా పనిచేస్తోంది. ఆమెకు తల్లి లేదు. తండ్రికి పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు.
కాగా బుధవారం ఉదయం జనాభా లెక్కల సేకరణ అధికారి ఆమె ఇంటికి వెళ్లి చూసేసరికి సుమలత రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే పోలీసులకు గ్రామస్తుల ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.