Potkapalli | ఓదెల, ఫిబ్రవరి 1: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు శనివారం రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడిన పెద్దమనిషిని కాంగ్రెస్ ప్రభుత్వం కావాల్సికొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కక్ష సాధింపు చర్యలను వెంటనే ఆపాలని లేనియెడల ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్, చర్లపల్లి సురేష్ గౌడ్, పరశురాములు, ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, కుమార్, అజార్ తదితరులు పాల్గొన్నారు.