మెట్ట ప్రాంతమైన చిగురుమామిడి మండలానికి కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతుండడాన్ని చూసి రైతులు, బీఆర్ఎస్ నాయకులు మురిసిపోతున్నారు. ఆదివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా సీతారాంపూర్ స్టేజీ సమీపంలోని కెనాల్ వద్ద గోదావరి జలాలకు పూజలు చేశారు.
అనంతరం అపరభగీరథుడు సీఎం కేసీఆర్తోపాటు ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ ఫ్లెక్సీకి మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, మాజీ ఎంపీపీ ఆకవరం భవాని, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ తిరుపతి కలిసి పూజలు చేసి జలాభిషేకం నిర్వహించారు.
– చిగురుమామిడి, మార్చి 22