Gangadhara | గంగాధర, సెప్టెంబర్ 15 : క్వారీలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందిన సంఘటన గంగాధర మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన్న సుధగోని అంజయ్య(41) గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి గ్రామ శివారులోని పీఎస్ఆర్ గ్రానైట్ క్వారీలో స్టోన్ కటింగ్ మిషన్ హెల్పర్గా పని చేస్తున్నాడు. అంజయ్య నైట్ షిఫ్ట్ విధుల్లో ఉండగా వర్షం కారణంగా సోమవారం ఉదయం 2:30 గంటల ప్రాంతంలో వర్షం కారణంగా బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.
వర్షపు నీటి ప్రవాహానికి పక్కనే రాళ్ల కుప్ప నుండి బండ రాయి ప్రమాదవశాత్తు జారి అంజయ్య తలపై పడింది. తీవ్రంగా గాయపడిన అంజయ్యను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గంగాధర ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.