గోదావరిఖని, నవంబర్ 18: రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్సింగ్ ఓటమి భయంతోనే తనపై దుష్ప్రచారం చేస్తున్నాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చదర్ నిప్పులు చెరిగారు. ఆంధ్రాప్రాంతానికి చెందిన తెలుగుదేశం నాయకులతో కలిసి సోషల్ మీడియా వేదికగా కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. ‘ఖని’ ప్రధాన చౌరస్తాలోని బీఆర్ఎస్ ఆఫీసులో శనివారం విలేకరులతో మాట్లాడారు.
తనదైన శైలిలో కాంగ్రెస్ అభ్యర్థిపై విరుచుపడ్డారు. గతంలో ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థులు పార్టీలు వేరైనా అన్నదమ్ముల్లా హుందా గా ప్రచారం చేసుకునేవారన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని టీడీపీ యూత్ నేత నాగ శ్రావణ్ కిలారు సంస్థ పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ ద్వారా జీడీకే డిజర్వ్ బెటర్ పేరిట పేస్బుక్ వాల్పై మార్ఫింగ్ చేసిన తన ఫొటోలను నీచమైన కామెంట్స్, పాటలతో పోస్ట్ చేయిస్తున్నాడని ఆరోపించారు.
వారికి మక్కాన్సింగ్ ఐడీ, మెయిల్తో పేవ్మెంట్ పంపిస్తున్నారన్నారు. న్యూస్ ఏజెన్సీ ద్వారా ఎవరైనా తనపై ప్రచారం చేసుకోచ్చు నని, ఫేస్బుక్ వాల్పై మార్ఫింగ్ చేసిన తన ఫొటోలు, నీచమైన కామెంట్లను మాత్రమే పోస్ట్ చేయడం బాధాకరమన్నారు. ముసుగులు ధరించిన కొందరు రద్దీ ప్రాంతాల్లో తనపై దుష్ప్రచారం చేసే ఇతర ప్రాంతాలలో ముద్రించిన కరపత్రాలు పంచడం ఫ్లెక్సీలు కట్టారని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు వారిని గుర్తించేలోగా పారిపోయారన్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయని, ఆర్వోకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
రాజకీయ నాయకుడంటే ప్రజల మనసులు గెలువాలి తప్పా ఇలా నీచానికి దిగజారడం ఎంత వరకు సమంజసమన్నారు. అయినా బీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనంతో ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ జిల్లా నాయకులు రాచకొండ కోటేశ్వర్లు, నర్సింగ్ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, నాయకులు పీటీ స్వామి, కౌశికహరి, గోపు ఐలయ్య యాదవ్, తానిపర్తి గోపాల్ రావు, మురళీధర్, బుచ్చిరెడ్డి, తోడేటి శంకర్, అచ్చ వేణు, జక్కుల తిరుపతి, రత్నాకర్, మొగిలి, మారుతి, స్వప్న, రఫిక్, బెందె నాగభూషణం, ఎల్లయ్య, గోవర్ధన్, బిక్కినేని నర్సింగరావు రమ్య యాదవ్ పాల్గొన్నారు.