ఇబ్రహీంపట్నం, నవంబర్ 5: బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. కోరుట్ల నియోజకవర్గంలో దూకుడుమీదున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కల్వకుంట్ల ప్రచారంలో దూసుకెళ్తుండగా, గులాబీ దళం కలియదిరుగుతున్నది. జనంతో మమేకమవుతూ ముందుకుసాగుతుండగా, అటు పదేండ్ల ప్రగతిని చూసి పార్టీలోకి వివిధ పార్టీల నుంచి వలసల వెల్లువ కొనసాగుతున్నది. వివిధ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, కారుకే జైకొడుతుండగా, పార్టీలో ఫుల్ జోష్ కనిపిస్తున్నది.
ఆదివారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని గురెటికాపు సంఘ సభ్యులు, కందకంగడ్డ మున్నూరు కాపు సంఘ సభ్యులు, ముదిరాజ్, రజక, ఒడ్డెర సంఘ సభ్యులు బీఆర్ఎస్కు జైకొట్టారు. తమ మద్దతు బీఆర్ఎస్కే అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు సమక్షంలో ప్రకటించారు. అలాగే గురిడికాపు సంఘ భవనంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సింగిల్ విండో చైర్మన్ తీగల రవీందర్రెడ్డి, పలువురు గురెడి కాపు సంఘ సభ్యులు, ముదిరాజ్ సంఘ సభ్యులు, పలువు రు మహిళలు పార్టీలో చేరగా, వారికి కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పలువురు కులసంఘాల నాయకులు మాట్లాడుతూ డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పా రు. కాగా, తనను ఆశీర్వదించినట్లుగానే తన తనయుడు తన తనయుడు సంజయ్ కల్వకుంట్లను ఆశీర్వదించి గెలిపించాలని ఎమ్మెల్యే విద్యాసాగర్రావు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు నమ్మి మోసపోవద్దని, నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, సంజయ్ని గెలిపించుకుంటే మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కార్యక్రమాల్లో వైస్ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు నేమూరి లత, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పోన్కంటి వెంకట్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఎలాల దశరథ్రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు రెబ్బటి రాజేందర్, నాయకులు జగన్రావ్, కంఠం రమేశ్, నేమూరి సత్యనారాయణ, చిన్నారెడ్డి, జేడి సుమన్, జిల్లా పవన్, సుగుణాకర్రావు, వాల్గొట్ నరేశ్, ప్రదీప్కుమార్, నేమూ రి నరేష్, ముదిరాజ్ కుల సంఘాల అధ్యక్షులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
మల్లాపూర్, నవంబర్ 5: బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సంజయ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఎమ్మెల్యే, అభ్యర్థి సంజయ్ కల్వకుంట్ల ఆధ్వర్యంలో సిరిపూర్, గుండంపల్లి గ్రామాలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు కాంగ్రెస్, బీజేపీలను వీడి బీఆర్ఎస్లో చేరగా, వారికి బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్తో కలిసి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న పథకాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సూచించారు. గతంలో మన గ్రామాల పరిస్థితి ఎలా ఉండెదో.. ఇప్పుడెలా మారాయో..? వివరించాలని సూ చించారు. ఇక్కడ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్, ఆర్బీఎస్ జిల్లా డైరెక్టర్ దేవ మల్లయ్య, సర్పంచులు భూక్య గోవింద్నాయక్, దనరేకుల మల్లు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఏనుగు రాంరెడ్డి, సింగిల్విండో చైర్మన్ బద్దం అంజరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు ఇర్రి జైపాల్రెడ్డి, రాజరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.