వేములవాడ, డిసెంబర్ 30: వేములవాడలో జరిగే మహాశివరాత్రి జాతరను సమష్టిగా విజయవంతం చేద్దామని కలెక్టర్ అనురాగ్ జయం తి సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా వేడుక ఏర్పాట్లను చేయాలని, సమన్వయంతో అధికారులు పనిచేస్తేనే ఇది సక్సెస్ అవుతుందని కలెక్టర్ చెప్పారు. గతం కంటే భక్తులు అధికంగా వచ్చే అవకాశముందని, ఈ నేపథ్యంలో గతం కంటే మెరుగ్గా మహాశివరాత్రి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మహాశివరాత్రి జాతర జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై శుక్రవారం వేములవాడ ఆలయంలోని ఓపెన్స్లాబ్లో వివిధశాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ అనురాగ్ జయంతి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎస్పీ రాహుల్హెగ్డే, అదనపు కలెక్టర్లు బీ సత్యప్రసాద్, ఎన్ ఖీమ్యానాయక్, ఆలయ కార్యనిర్వహణాధికారి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ట్రా న్స్పోర్టు, పార్కింగ్, రోడ్ల మరమ్మతులు, అకామిడేషన్, తాగునీరు, విద్యుత్ సరఫరా, బం దోబస్తు పార్కింగ్, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, క్యూ లైన్ మెనేజ్మెంట్, పబ్లిక్ అడ్రెస్ సిస్టం ఏర్పా టు, శివార్చన కార్యక్రమం సూచికల ఏర్పాట్లు, ప్రచారం, అనుబంధ ఆలయాల్లో ఏర్పాట్లు తదిరత అంశాలపై కార్యాచరణ ప్రణాళికను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి శాఖ క్షేత్రస్థాయిలో అమలుచేసే సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసుకొని వచ్చే సమావేశంలో వివరించాలని చెప్పారు. పారిశుద్ధ్యం ప్రాధాన్యతను గుర్తించి మ్యాన్ పవర్, వాహనాలను పెంచుకోవాలని చెప్పారు. మరిన్ని ఎక్కువగా టాయిలెట్, డ్రెస్ చేంజింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసి సిబ్బంది నిరంతరం ఉండేలా చూసుకోవాలని చెప్పారు. తాగునీరు, శానిటేషన్ టాయిలెట్ ప్లాన్, స్టాప్ ప్లాన్, మెటీరియల్ ప్లాన్లను ఆయా శాఖల అధికారులు సిద్ధం చేసి అదనపు కలెక్టర్కు అందజేయాలన్నా రు. ఆర్టీసీ అధికారులు యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండే రూ ట్లలో అదనపు బస్ సర్వీసులను నడపాలని ఆదేశించారు. రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. టెంపుల్తో పాటు అన్ని ముఖ్య ప్రదేశాలను ఆ ధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా విద్యుత్ దీ పాలతో అందంగా అలంకరించాలన్నారు. ఆయా శాఖల అధికారులు వారికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాల న్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్జయంతి మాట్లాడుతూ ఫిబ్రవరిలో నిర్వహించే మహాశివరాత్రి జాతరకు పెద్ద సంఖ్యలో భక్తుల హాజరై అవకాశమున్న దృష్ట్యా అందుకు అనుగుణంగా ఏర్పా ట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రధానంగా పారిశు ద్ధ్యం, పార్కింగ్, క్యూలైను, తాగునీరు సరఫరా మెనేజ్మెంట్ ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. వచ్చే సమావేశంలో అన్ని ప్రభుత్వశాఖలు తమకు అప్పగించిన బాధ్యతలు, చేయబోయే కార్యచరణను వివరిస్తూ సూక్ష్మ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తేవాలని ఆదేశించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎస్పీ రాహుల్హెగ్డే మాట్లాడుతూ శివరాత్రి జాతరకు జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్రా ఫిక్, పార్కింగ్, క్యూలైను ధర్మగుండం కంట్రోల్రూమ్, బ్యారికేడింగ్ మేనేజ్మెంట్ను పకడ్బందీగా చేస్తామన్నారు. గతం కంటే అధికంగా సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూ స్తామన్నారు. సమావేశంలో ఆదనపు కలెక్టర్ ఖీ మ్యానాయక్, సత్యప్రసాద్, వేములవాడ ఆర్డీ వో పవన్కుమార్, వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి, జిల్లా రవాణాధికారి కొండల్రావు, డీపీవో రవీందర్, ప్యాకేజీ-9 కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీనివాస్ రెడ్డి, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఉన్నారు.