చొప్పదండి/ రామడుగు, మార్చి 20 : వడగండ్ల వానకు పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసా ఇచ్చారు. అధికారులతో వంద శా తం సర్వే చేయిస్తామని, పరిహారం అందుతుందని హామీ ఇచ్చారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తుంటే గుండె తరుక్కుపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం రామడుగు మండలంలోని లక్ష్మీపూర్, వెంకట్రావుపల్లి, చొప్పదండి మండలంలోని మంగళపల్లి గ్రామా ల్లో క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. మామిడి, కరబూజ, వరి, మక్క, మిర్చి, ఇతర కూరగాయ పంటల నష్టం గురించి రైతులను అడి గి తెలుసుకున్నారు.
లక్ష్మీపూర్కు చెందిన ద్యావ బాపురెడ్డి మామిడితోటను పరిశీలించి, ఆ రైతును ఓదార్చారు. గ్రామంలోని బేడ బుడగ జంగాల కాలనీలో దెబ్బతిన్న ఇంటిపైకప్పులను చూశారు. వెంకట్రావుపల్లిలో వరి, మక్క పంటలను పరిశీలించారు. మంగళపల్లిలో మార్కెట్ డైరెక్టర్ ఏనుగు స్వామిరెడ్డి మిర్చి, కళ్లెం జగన్రెడ్డి కరబూజ, దెబ్బతిన్న పంట పొలాలలకు వెళ్లి మనోధైర్యం కల్పించారు. అధికారులు ఏ ఒక్క రైతునూ వదలకుండా పంట నష్టంపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు.
రెం డురోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు, చొప్పదం డి, గంగాధర, బోయినపల్లి మండలాల్లో పంటలన్నీ పూర్తిస్థాయిలో నష్టపోయారని, ఎటు చూసి నా హృదయ విధారకంగా ఉందన్నారు. నష్టంపై పూర్తి సర్వేచేసి, అంచనాలతో సహా నివేదికను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని, నష్టపోయిన ప్రతి కుటుంబానికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే వెంట సింగిల్విండో చైర్మన్ వెల్మమల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, సర్పంచులు చిలుముల రజిత ప్రభాకర్, జవ్వాజి శేఖర్, గుంట రవి, ఎంపీటీసీ కనుకం జయకనుకయ్య, ఉప సర్పంచ్ నరేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు వెల్మ శ్రీనివాస్రెడ్డి, గంట్ల జితేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జంకె రాంచంద్రారెడ్డి, మధూకర్రెడ్డి, రత్నాకర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మ్యాకల అంజయ్య, మాచ ర్ల వినయ్కుమార్, తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, ఏవో వంశీకృష్ణ, ఏఈవోలు రాజేశ్, ప్రసన్న, హార్టికల్చర్ హెచ్వో రోమిత్ తదితరులు ఉన్నారు.