పెద్దపల్లి : పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను( BRS Candidates ) భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ( Dasari Manohar Reddy ) కోరారు. బుధవారం పట్టణంలోని 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మహేష్తో కలిసి ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో తెచ్చిన మార్పులను ప్రజలకు గుర్తు చేశారు. నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ హామీలతో కాలం గడుపుతోందని విమర్శించారు.
ప్రజల సమస్యలను పట్టించుకోకుండా మాటలతో మాత్రమే పాలన కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వానికి మళ్లీ ఓటు ద్వారా గుణ పాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో 23 వార్డు అభ్యర్థి శ్యామ్, నాయకులు హరీష్, రాజేష్, మహేందర్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.