సిరిసిల్ల రూరల్, జనవరి11: వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తామని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పేర్కొన్నారు. బుధవారం ఆయన తంగళ్లపల్లి మండల కేం ద్రంలోని మండల పరిషత్ నూతన భవనాన్ని సందర్శించారు. సెస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా మండలపరిషత్ను సందర్శించగా, ఆయనకు సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిక్కాల రామారావుతోపాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యను ఎంపీపీ పడిగెల మానస, ప్రజాప్రతినిధులు సన్మానించారు. అనంతరం చిక్కాల మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంతో సెస్ చైర్మన్గా రెండోసారి ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు.
తంగళ్లపల్లిలో విద్యుత్ సమస్యలలను అమాత్యుడి సహకారంతో పరిష్కరిస్తాననన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, వైస్ ఎంపీపీ జంగిటి అంజయ్య, ఉపసర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పెద్దూ రి తిరుపతి, సింగిల్విండో చైర్మన్ బండి దేవదాస్గౌడ్, వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీపీ పూసపల్లి సరస్వతి, పడిగెల రాజు, ఎంపీటీసీలు బుస్స స్వప్న, సిలువేరి ప్రసూన, కర్కబోయిన కుంటయ్య, ములి గే దుర్గాప్రసాద్, నాయకులు పడిగెల రాజు, బండి జగన్, గుగ్గిళ్ల ఆంజనేయులుగౌడ్, క్యారం జగత్, సిలువేరి నర్స య్య, ఎండీ హమీద్, మోర నిర్మల, సద్ద రోజా, సాహేదాబేగం, విశ్వనాథుల రమేశ్, రెడ్డి పరశురాములు, బండారి మల్లికార్జున్, అరవింద్, రమే శ్, బుస్స లింగం, సిద్ధన్న, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.