కరీంనగర్లోని తీగలగుట్టపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు సంబంధించి టెండర్లు సోమవారం ఖరారయ్యాయని, పనులు కూడా వెంటనే ప్రారంభం కానున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ వెల్లడించారు.
ఎర్రమంజిల్లోని కార్యాలయంలో జరిగిన కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ అధికారుల ఉన్నతస్థాయి సమావేశంలో టెండర్ల అంశంపై తుది నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వెంటనే టెండర్లు నిర్వహించి, పనులు కూడా ప్రారంభిస్తారని పేర్కొన్నారు. – కార్పొరేషన్, జూన్ 12