కమాన్ సెప్టెంబర్ 24: జిల్లా కేంద్రంలో వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం పలు మండపాల వద్ద ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు, కుంకుమపూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో పలు వినాయక మండపాల్లో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వడ్డన చేశారు. అలాగే, పలు వినాయక మండపాలను మేయర్ యాదగిరి సునీల్ రావు సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 33వ డివిజన్ (భగత్ భగత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద మహాగణపతి హోమం చేశారు. ముఖ్య అతిథిగా మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరై ప్రత్యేక పూజలు చేసి మొకులు చెల్లించుకున్నారు. భగత్ మల్లమ్మ మారెట్ వద్ద చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపం, అయ్యప్ప ఆలయం వద్ద ఆదర్శ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో, సాయికృష్ణ థియేటర్ సమీపంలో, బాలరక్ష భవన్ వద్ద చీటి రామారావు ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపాల్లో మేయర్ సునీల్ ప్రత్యేక పూజలు చేశారు. అలాగే, విద్యానగర్ హిమాలయ నివాస్ అపార్ట్ గణపతి హోమం, గోపూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇక్కడ విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి, గుజ్జ సతీశ్, స్వర్గం రాధాకృష్ణ, కామ శ్రీనివాస్, పోలాడి సత్యనారాయణ రావు, తదితరులు పాల్గొన్నారు. న్యూశ్రీనగర్ కాలనీలోని గణేశ్ మండపంలో శ్రీనీలకంఠ భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ గర్రెపల్లి ఆంజనేయులు, వడాల మాధవి, కొండూరి పుష్పలత, బెల్లపు సరిత, పంజాల సంధ్య, బైరి కవిత, పంజాల శ్రీధర్ గౌడ్, ఎజ్జు శ్రీనివాస్, పంతంగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పూజలందుకుంటున్న మొదటి గణపతి
జిల్లా కేంద్రంలోని పాతబజార్ చిన్నహనుమాన్ ఆలయం వద్ద మొట్టమొదటి సారి 1952లో గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. నవరాత్రోత్సవాల్లో ప్రతి రోజూ మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం అల్పాహారం పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అమెరికాలో ప్రత్యేక పూజలు
అమెరికాలోని ఫిలడెల్పియా ఈస్ట్ విలేజ్ కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు గణేశ్ నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సరస్వతీ పూజలతో పాటు నాటకాల రూపంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ జిల్లా వాసులు ప్రదీప్, ప్రచీ, హరికృష్ణ, మహేశ్వరి, రాజీవ్ రంజన్, మృదుల, పంకజ్, శ్వేత, సందీప్, మనోజ్ శర్మ, పల్లవి, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.
విద్యానగర్, సెప్టెంబర్ 24: నగరంలోని 17వ డివిజన్ కొత్తయాస్వాడలోని వినాయక మండపం వద్ద ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్ కోల భాగ్యలక్ష్మి-ప్రశాంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ర్యాకం సుధాకర్ పటేల్, తోట సునీల్ పటేల్, శ్రీరామ్, గంగారెడ్డి, వరాల పరశురాములు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, సెప్టెంబర్ 24: మండలంలోని దుర్శేడ్ గ్రామంలో గల రాంనగర్ యువ భారత్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్ వార్డు సభ్యులు రాజ్ సుజాత, యూత్ సభ్యులు శ్రీధర్, ప్రసాద్, కమల్, నవీన్, అజయ్, అరవింద్, హరీశ్, రవి, రాజు, మహేశ్, హరీశ్, తదితరులు పాల్గొన్నారు. బొమ్మకల్ కృష్ణనగర్ ఏర్పాటు చేసిన వినాయక మండపంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, తోట రమేశ్, దాది సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. చెర్లభూత్కూర్ జెండా చౌరస్తాలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, బుర్ర తిరుపతి గౌడ్, చిట్కూరి శేఖర్, మెరుగు శ్రీధర్, భక్తులు పాల్గొన్నారు. దుర్శేడ్ వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద గణపతి హోమం చేశారు. భక్తులు ప్రశాంత్ గౌడ్, రమేశ్, మహేందర్, అజయ్, శ్రీనివాస్, అశోక్ పాల్గొన్నారు.