వేములవాడ, ఏప్రిల్ 22 : వేములవాడ పట్టణాన్ని ఇప్పటికే 400కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని, మరిన్ని నిధులతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నా రు. పట్టణంలోని ముదిరాజ్, మ్యాదరి సంఘం, వేములవాడలో స్థిరపడిన నాయీ బ్రాహ్మణుల సంఘాలకు ఒకొకరికి 3లక్షల చొప్పున నిధుల మంజూరు ప్రొసీడింగ్ కాపీలను సంగీత నిలయంలో సంఘ సభ్యులకు శనివారం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నాయకత్వంలో వేములవాడ పట్టణాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దుతున్నామ ని, 50 కోట్లతో బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ, గుడి చెరువు బండ్ సుందరీకరణ, రహదారుల విస్తరణ లాంటి అభివృద్ధి పనులు ప్రతిపాదించడమే కాకుండా వచ్చే ఆగస్టు నాటికి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. 100 రోజు ల్లో 1200 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి నిరుపేదలకు అందజేసేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. ఇక్కడ సెస్ డైరెక్టర్ నామాల ఉమా, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పులం రాజు, గోసుల రవి, కౌన్సిలర్లు సిరిగిరి రామచందర్, యాచమనేని శ్రీనివాసరావు, ఇప్పపూల అజయ్, నాయకులు రామతీర్థపు రాజు, గూడూరి మధు, కొండ కనకయ్య, కొండ నర్సయ్య, పట్టణ ముదిరాజ్ సం ఘం అధ్యక్షుడు తిరుపతి, మ్యాదరి సంఘం అధ్యక్షులు కనికరపు రమేశ్, నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నర్సయ్య ఉన్నారు.