వేములవాడ టౌన్, మార్చి 17: వేములవాడ రాజన్న ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా కనిపించింది. రాజన్నను ఎనిమిది వేలకు పైగా భక్తులు దర్శించుకోగా, రూ.9లక్షలకు పైగా ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు.
కాగా, స్వామివారిని జిల్లా అసిస్టెంట్ సెషన్ జడ్జి శ్రీలేఖ, రాష్ట్ర దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ సంచాలకుడు బొడ్ల శైలజ దర్శించుకున్నారు.