వేములవాడ టౌన్, జనవరి 19: వేములవాడ రాజన్న ఆలయం శుక్రవారం భక్త జన సంద్రంగా మా రింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తుల తో కిటకిటలాడింది. ధర్మగుండం, కల్యాణకట్ట వద్ద రద్దీ కనిపించింది. రాయేశుడికి తలనీలాలు సమర్పించిన తర్వాత ధర్మగుండంలో స్నానాలు చేసి క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు.
అభిషేక, అన్నపూజలు చేశారు. స్వామివారికి ప్రీతికరమైన కోడె మొక్కును చెల్లించుకున్నారు. నిలువెత్తి బంగారాన్ని సమర్పించి భక్తులకు పంచిపెట్టారు. సుమారు 40వేల మంది దర్శించుకున్నారని, 16లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు.