వేములవాడ, ఫిబ్రవరి 2: రోగులకు అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్న వేములవాడ ఏరియా దవాఖానకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. దవాఖానల్లోని అన్ని విభాగాల్లో మెరుగైన సేవల నిర్వహణకు గానూ కేంద్రం శుక్రవారం నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్వాస్) సర్టిఫికెట్ ప్రకటించింది. కార్పొరేట్కు దీటుగా అత్యాధునిక ప రికరాలు, మౌలిక సదుపాయాలు, వసతులతో రో గులకు నాణ్యమైన సేవలందిస్తుండగా, కేంద్ర బృం దం గతేడాది అక్టోబర్లో వేములవాడ ఏరియా దవాఖానను సందర్శించింది.
ఫార్మసీ, ఓపీడీ, అడ్మిన్, రేడియాలజీ, ఎమర్జెన్సీ, ఆక్సిలరీ సర్వీసెస్, ఐపీడీ, ఓటీ, ల్యాబ్, మెటర్నిటీ వార్డుల్లో అందిస్తు న్న సేవలకు గానూ ఎన్క్వాస్ సర్టిఫికేషన్, లేబర్ రూమ్ మెరుగైన నిర్వహణకు గానూ లక్ష్య ప్రోగ్రామ్ లో భాగంగా సర్టిఫికేషన్న, అలాగే పీడీయాట్రిక్ విభాగంలో ఉత్తమ వైద్య సేవలకు గానూ ముసాన్ సర్టిఫికేషన్ను వేములవాడ ఏరియా దవాఖాన కైవసం చేసుకున్నది. ఎన్క్వాస్ గుర్తింపు రావడంపై కలెక్టర్ అనురాగ్ జయంతి హర్షం వ్యక్తం చేశారు.
జిల్లాలో దవాఖానలో వైద్య ప్రమాణాలు మెరుగయ్యాయని చెప్పడానికి ఈ సరిఫ్టికెట్ నిదర్శనమన్నా రు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు నాణ్యమైన, అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. అందుకు కృషి చేసిన సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేశ్రావు, వైద్యులు అనిల్కుమార్, సంతోష్చారి,తిరుపతికి అభినందనలు తెలిపారు.