వెల్గటూర్, నవంబర్ 3 : నాటి సమైక్య పాలనలో ఎడారిని తలపించిన ముత్తునూరు భూములు, స్వరాష్ట్రంలో సస్యశ్యామలంగా మారాయి. నాడు పక్కనే గోదావరి పారుతున్నా చుక్కనీరు లేక నెర్రెలుబారిన నేలలు, నేడు బంగారు పంటలు పండిస్తున్నాయి.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో గోదావరి జీవనదిలా మారడం.. ముక్తేశ్వర స్వామి ఎత్తిపోతల పథకం (లిఫ్ట్)తో 2వేల ఎకరాల్లో ధాన్యపు సిరులు కురుస్తున్నాయి. వానకాలం వేసిన పొలాలు కోతకు రాగా, అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ కరువు తీర్చిన సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్కు కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి.