కరీంనగర్ : అమెరికాలోని డెట్రాయిట్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీణవంకకు చెందిన పాడి దయాకర్ రెడ్డి(71) మరణించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన దయాకర్ రెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా తుది శ్వాస విడిచారు. మృతుడికి భార్య, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన కుమారుడు యూఎస్లో స్థిరపడటంతో హైదరాబాద్లో ఉండే దయాకర్రెడ్డి 20 ఏళ్ల క్రితం అమెరికాకు వలస వెళ్లారు. వీణవంక, పరిసర ప్రాంతాల్లో భూస్వామిగా పేరొందిన సుధాకర్రెడ్డి కుమారుడు ఈ దయాకర్రెడ్డి. అంతేకాకుండా యుప్( YUPP TV) టీవీ సీఈవో పాడి ఉదయ్ నందన్రెడ్డి మామయ్య. దయాకర్రెడ్డి మృతిపై బంధువులు, వీణవంకవాసులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.