సామాన్యుడు, అందరిలో కలిసిపోతే తత్వం ఉన్నవాడు, విద్యార్థిగా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నవాడు, పేద ప్రజల బాధలు తెలిసిన వాడు.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని వీణవంక ఎంపీటీసీలు అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిచి తీరుతారని చెప్పారు. గెల్లు గెలుపు కోసం బుధవారం మండలంలోని ఎంపీటీసీలు అంతా కలిసి కోర్కల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేశారు. స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవాలని కోరుకున్నట్టు పేర్కొన్నారు.