Vemulawada | వేములవాడ రూరల్, ఏప్రిల్ 5 : వేములవాడ మున్సిపల్ పరిధిలోని మూడో వార్డు అయ్యోరూపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున పిడుగుపాటుకు రెండు గేదెలు (బర్రెలు) మృతి చెందాయి.
స్థానికుల కథనం ప్రకారం.. అయ్యోరుపల్లి గ్రామానికి చెందిన యువరైతు ఉల్లెందుల రఘుపతికి చెందిన రెండు గేదెలను పంట పొలం వద్ద ఉన్న చెట్టుకు కట్టివేశాడు. రాత్రి ఉరుముల తో కూడిన వర్షం పడగా పిడుగు పడి అవి మృతి చెందాయి. వాటి విలువ దాదాపు రూ.లక్షాయాబైవేల వరకు ఉంటుందని బాధితుడు వాపోయారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.