తెలంగాణచౌక్, ఫిబ్రవరి 6: ఇచ్చిన హామీ మేర కే ప్రముఖ పుణ్మక్షేత్రం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి బస్సు సౌకర్యం కల్పించామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం క రీంనగర్ బస్టాండ్లో యాదగిరిగుట్ట బస్సుకు పూ జలు చేసిన అనంతరం జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా బస్సు సర్వీసుకు యాదాద్రి ఎక్స్ప్రెస్గా నామకరణం చేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. గతంలో యాదగిరిగుట్టకు వెళ్లేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులుపడేవారని, ఈ పరిస్థితుల్లో ప్రత్యేక బస్సును అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ప్రతిరోజూ రెండు ట్రిప్పులు నడిపించనున్నారని పేర్కొన్నారు. బస్సు ఉదయం 6గంటలకు కరీంనగర్ నుంచి బయల్దేరి తిమ్మాపూ ర్, నుస్తూలాపూర్, సుందరగిరి, హుస్నాబాద్, జనగామ, ఆలేరు మీదుగా 9.25 గంటలకు యా దాద్రికి చేరుకుంటుందని తెలిపారు. తిరిగి యాదా ద్రి నుంచి ఉదయం 10గంటలకు బయల్దేరి మ ధ్నాహ్నం 1.30కు కరీంనగర్కు చేరుకుటుందన్నారు.
మరో బస్సు కరీంనగర్ నుంచి మధ్నా హ్నం 2.30కి బయల్దేరి సాయంత్రం 5.55 గంటలకు యాదాద్రికి, తిరిగి 6.15 బయల్దేరి రాత్రి 9.35 గంటలకు కరీంనగర్కు చేరుకుంటుందని వెల్లడించారు. పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.100 చార్జీలు నిర్ణయించినట్లు చెప్పారు. జిల్లా ప్రజలు బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మేయర్ సునీల్రావు, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, నాయకులు చల్లా హరిశంకర్ పాల్గొన్నారు.