హుజూరాబాద్టౌన్/వీణవంక/ఇల్లందకుంట, నవంబర్ 3 : మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే ఈటల రాజేందర్ తన అనుచరులతో పలివెలలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులపై దాడి చేయించారని వీణవంక, ఇల్లందకుంట మండల గులాబీ నేతలు మండిపడ్డారు.
దాడిని తీవ్రంగా ఖండించారు. దీనికి నిరసనగా హుజూరాబాద్ పట్టణంతోపాటు వీణవంక, ఇల్లందకుంట మండలకేంద్రాల్లో ఈటల దిష్టిబొమ్మలను దహనం చేశారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే ఊరుకునేది లేదని, తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.