జమ్మికుంట రూరల్, డిసెంబర్ 1: తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, కేడీసీసీబీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్ కొనియాడారు. గురువారం పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద కేడీసీసీబీ వైస్ చైర్మన్, ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో పోలీస్ కిష్టయ్య 13వ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ఏర్పాటు కోసం బలిదానం చేసుకున్న గొప్ప ఉద్యమకారుడు పోలీస్ కిష్టయ్య అని కొనియాడారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ముదిరాజ్ మహాసభ నాయకులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ టౌన్, డిసెంబర్ 1: తెలంగాణ అమరవీరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం హుజూరాబాద్ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా కిష్టయ్య చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నాయకులు పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ యువత హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు గంట సంపత్ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మండలాధ్యక్షుడు గంట శ్రీనివాస్ముదిరాజ్, అంబేదర్ జయంత్యుత్సవ సంఘం అధ్యక్షుడు బోరగల సారయ్య, బాబూ జగ్జీవన్రావు జయంత్యుత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజలింగం, జేఏసీ నాయకులు వేల్పుల రత్నం, బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఎఱ్ఱబొజ్జు నారాయణ, నాయకులు చందుపట్ల జనార్దన్, గంగిశెట్టి రాజు, రావుల వేణు, గంగిశెట్టి ప్రభాకర్, పోతుల సంజీవ్, బీఆర్ గౌడ్, గడ్డం సమ్మయ్య, యాళ్ల సంజీవరెడ్డి, తూర్పాటి రాజు, ఆవుల సదయ్య, మహ్మద్ బాబర్, చంద్రగిరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సైదాపూర్, డిసెంబర్ 1: మండలకేంద్రంలో గురువారం పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి మహాసభ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు రాయిశెట్టి చంద్రయ్య, ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు పోలు ప్రవీణ్కుమార్, నాయకులు పాల్గొన్నారు.
వెన్నంపల్లి గ్రామంలో ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు పెసరు కుమారస్వామి ఆధ్వర్యంలో పోలీస్ కిష్టయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ నాయకులు పాల్గొన్నారు.