కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మె ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విజయవంతమైంది. కార్మికులు, రైతులు జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించి, నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.
సమ్మెలో బీఆర్ఎస్ కార్మిక విభాగంతోపాటు సీపీఎం, సీపీఐ, టీడీపీ, సీసీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ, ఆర్ఎస్పీ, తదితర పార్టీలు వాటి అనుబంధ సంఘాలతో పాటు మెడికల్ రిప్లు, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, సహాయకులు, మున్సిపల్, పంచాయతీ కార్మికులు, హమాలీలు, రైస్ మిల్ ఆపరేటర్లు, ఆటో డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు తదితర 50 రంగాలకు చెందిన కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు.
– కరీంనగర్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ)