తిమ్మాపూర్, జూలై 12: రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా తిమ్మాపూర్, గన్నేరువరం మండలాల వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా రైతులు, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ‘ఖబడ్దార్ రేవంత్రెడ్డి..’ అంటూ నినాదాలు చేశారు. గ్రామ, గ్రామాన రాజీవ్ రహదారిపై, గ్రామాల్లో ప్రధాన చౌరస్తాల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కంటికిరెప్పలా కాపాడుకుంటుంటే ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. వారి పాలనలో మాదిరిగా రైతులు ఇబ్బందులు పడితే రాక్షసానందం పొందాలని చూస్తున్నారని విమర్శించారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, నుస్తులాపూర్ సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఆర్బీఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
శంకరపట్నంలో..
శంకరపట్నం, జూలై 12: వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రేవంత్రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దగ్దం చేశారు. రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా, ఉచిత విద్యుత్ పథకానికి అనుకూలంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి, వైస్ఎంపీపీ రమేశ్, సర్పంచ్ భద్రయ్య, ఎంపీటీసీ గాండ్ల తిరుపతయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్, మెట్పల్లి సింగిల్విండో చైర్మన్ సంజీవరెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు అంతం తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచులు మోత్కూరి సమ్మయ్య, పంజాల రాజయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉమ్మెంతల సతీశ్రెడ్డి, మేకల కుమార్, శేషాచారి, కుమార్యాదవ్, జంపయ్య, బొజ్జ రవి, శ్రీనివాస్, నాగయ్య, రమేశ్, రామకృష్ణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
మానకొండూర్ మండలంలో..
మానకొండూరు రూరల్, జూలై 12: మండలంలోని పలు గ్రామాల్లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. కొండపల్కలలో గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా మండలాధ్యక్షురాలు బొంగోని రేణుక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు తోట రమేశ్, ధర్పల్లి సంపత్, కడారి రమేశ్, గోసుల స్వామి, ఆర్బీఎస్ కన్వీనర్ కడారి ప్రభాకర్, గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్గొండ తిరుపతి, ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షుడు దాసరి రాజకుమార్, వార్డు సభ్యులు సాదినేని సుధాకర్, మాజీ ఎంపీటీసీ జనగాం శంకర్ గౌడ్, నాంపల్లి సంపత్ ముదిరాజ్, బండి సంపత్, కొలిపాక రాయమల్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
చిగురుమామిడిలో..
చిగురుమామిడి, జూలై 12: మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో రైతులు, నాయకులు బుధవారం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. బస్టాండ్ వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అన్నారు. రైతులకు రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి సాంబారి కొమురయ్య, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్ బేతి రాజిరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు పెనుకుల తిరుపతి, బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, మాజీ ఎంపీపీ అందే సుజాత, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నాయకులు, గ్రామాధ్యక్షులు పాల్గొన్నారు.