గోదావరిఖని, డిసెంబర్ 26: నేటి సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుండగా, యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ ముగిసిన అనంతరం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనున్నది. ఆ వెంటే ఫలితాలు ప్రకటించనుండగా, పోలింగ్ రోజును సింగరేణి యాజమాన్యం హాలిడేగా ప్రకటించింది. కాగా, మొత్తం 11 ఏరియాల పరిధిలో 13 సంఘాలు పోటీలో ఉండగా, 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అధికారులు 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రామగుండం -1లో 11 పోలింగ్ కేంద్రాల్లో 5384 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆర్జీ-2లో 6 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటిలో 3556 కార్మికులు, ఆర్జీ-3లో 6 పోలింగ్ కేంద్రాల్లో 3884 మంది కార్మికులు ఓటు వేయనున్నారు.
ఆర్జీ-1లోని 1వ నంబర్ పోలింగ్ బూత్ జీడీకే-1,3 గనులకు సంబంధించి 440 మంది, 2వ బూత్ ఫిట్ ఆఫీసులో 557 మంది, 3వ బూత్ సర్వే ఆఫీస్ జీడీకే2లో 780 మంది, 2ఏ బూత్లో 451 మంది, ఓసీపీ-5 కాన్ఫరెన్స్ హాల్లో 371 మంది సేఫ్టీ ఆఫీసర్ రూం జీడీకే-11వ గనిలో 875 మంది, ఇదే గనిలో ఏర్పాటు చేసిన మరో పోలింగ్ బూత్లో 893 మంది ఏరియా వర్క్షాపు ఆఫీసులో 182 మంది, ఏరియా హాస్పిటల్ల్ 222 మంది, సివిల్ డిపార్ట్మెంట్లో 581 మందిరెస్యూ స్టేషన్లో 32 మంది, మొత్తం 5384 మంది ఓటు వేయనున్నారు. ఆర్జీ-2లో 7 ఎలీపీలో 66 మంది వకీల్పల్లిలో 865 మంది ఓసీపీ-3 కృషి భవన్ బూత్లో 1081 మంది ఓసీపీ-3 ఆఫీసులో 788 మంది, సీహెచ్పీ రెస్ట్ సెంటర్లో 298 మంది, లెక్చరర్ హాల్లో 458 మంది మొత్తం 3556 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్జీ-3 రీడింగ్ రూమ్ ఎస్ అండ్పీసీలో 299 మంది, ఓసీపీ-1 సైటాఫీసులో 541 మంది, ఓసీపీ-1 కాన్ఫరెన్స్లో 531 మంది, ఓసీపీ-2 మినీ క్యాంటీన్లో 859 మంది, ఏఎల్పీ బూత్లో 810 మంది ఇదే గనిలో ఏర్పాటు చేసిన మరో బూత్లో 844 మంది మొత్తం 3884 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఖనిలో ఎన్నికల కౌంటింగ్
సింగరేణి ఆర్జీ-1,2,3కు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను గోదావరిఖని ఆర్జీ-1 కమ్యూనిటీ హాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆర్జీ-1,2,3లో జరిగిన పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను కమ్యూనిటీ హాల్కు తరలించి అక్కడే రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.