ప్రగతి ప్రదాత.. ఆపద్బాంధవుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేడుకల్లో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన సేవలను పలువురు కొనియాడారు.
మా సొంతూరు గంభీరావుపేట మండలం గోరంటాల. వ్యవసాయ కూలీ పనిచేసిన. నాడు కాలం కాక, నీళ్లకు గోసై ఎవుసం నడవలేదు. పల్లెటూర్లో ఏముం టం? ఏదైనా పెద్ద ఊరికి పోతే కొంత పనైనా దొరుకుతుందనుకున్నం. 2003లో భార్య, బిడ్డ, కొడుకుతో కలిసి సిరిసిల్లలోని సాయినగర్కు వచ్చిన. గుంటన్నర జాగకొని ఇల్లుకట్టుకున్న. ఇక్కడేదైనా పని దొరుకుతుందనుకుంటే రోజుకో నేత కార్మికుడి సావు చూసి ఇక్కెడికెందుకొత్తిరా దేవుడా అనుకుని బాధపడ్డం. అడ్డమీదికి పోయినా పనిదొరకలేదు. పొట్టగడవక తిప్పలైంది. 2004 లో దుబాయికి పోయిన. 17ఏండ్లకు 2021లో తిరిగి వచ్చినా. హైదరాబాద్లో విమానం దిగి బస్సులో వచ్చిన నేను సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తా వద్ద దిగిన. పోతున్న బస్సును ఆపి నేను సిరిసిల్లకు పోవాలే ఇక్కడెందుకు దింపినవని అడిగిన. బాబు ఇది సిరిసిల్లనే అంటూ కండక్టర్ చెబితే నమ్మలేదు. అక్కడున్న ఆటోవాలాలు అందరు నన్ను చూసి నవ్వుతూ ఇది సిరిసిల్లనే అంటూ దవఖానవైపు చూపించిండ్రు. నాడు దవాఖాన గిట్లెందుకుండే, ఈ రోడ్లు, డివైడర్లు, లైట్లు అన్ని చూసి నాకు మతిపోయింది. చౌరస్తాలో తెల్లరంగుతో గ్రంథాలయ భవనం చూసి పరేశాన్ అయినా. నా కండ్ల ను నేనే నమ్మలేక సిరిసిల్ల గింత డెవలప్ అయ్యిందా అని అనుకుంటూ నడుస్తుంటే ఎక్కడికి పోవాలంటూ ఆటోవాలా అడిగిండు. సాయినగర్ అని చెప్పి ఎక్కిన. అక్కడికెళ్లినంక మాఇళ్లు దొరకలేదు. ఇంటి సుట్టు ఇండ్లయినయ్. ఊరుకు కొత్తనా అంటూ డైవ్రర్ మళ్లీ అడిగిండు. చాలేండ్ల కింద దేశం పోయి ఇప్పుడే వత్తున్నా అని చెప్పిన. అప్పుడు ఆ డ్రైవర్ మొత్తం చెప్పిండు. కేటీఆర్ సార్ జెయ్యవట్టి సిరిసిల్ల జిల్లా అయ్యింది. బాగా డెవలప్ జేసిండు. కాలేజీలు తెచ్చిండు. ఇంతలోనే మా ఆవిడ నన్ను చూసి దగ్గరకు వచ్చింది. ఏమైంది ఇంకా ఇంట్లకొత్తలేవంటే ఇళ్లే దొరకుత లేదన్నా. అయ్యో ఎదురుంగ ఉన్నది మన ఇల్లేనని తీసుకెళ్లింది. కేటీఆర్ దయవల్ల నాటి సిరిసిల్ల నేడు ఎంతో మారిపోయింది. మళ్ల దుబాయికి పోదామని అనుకున్న. అప్పుడు అందరూ దుబాయ్కు ఎందుకు..? మన్నుబుక్కనా.. అని తిట్టిండ్రు. ఇక్కడే ఓషాపులో గుమస్తాగా చేరి మంచిగా పనిచేసుకుంటున్న.
మనసున్న మారాజు మా ఎమ్మెల్యే కేటీఆర్ సాబ్. ఆయన ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరు పుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాం. కేటీఆర్ సార్ నిరుపేద పద్మశా లీలు ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికేలా మాకు ఉపాధి మార్గాలు పెంచారు. నేను కోడం రాజు సాంచాలు నడుపు తా. కరోనా సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిఫ్ట్ పథకం ద్వారా నాకు 36 వేలు ఆర్థిక సాయం అంది మా కుటుంబాన్ని ఎంతగానో ఆదుకుంది. యారన్ సబ్సిడీ డబ్బులు 2018లో రూ.10 వేలు, 2019లో 23వేలు, 2020లో 24 వేలు నాకు ప్రభుత్వం ద్వారా అందాయి. 5లక్ష నేతన్న బీమా బాండ్ తీసుకు న్నా. చేతినిండా పని కల్పిస్తున్న కేటీఆర్ సార్ సీఎం కావాలె.
సిరిసిల్ల అంటేనే అభివృద్ధి. అభివృద్ధికి బ్రాండ్ నేమ్ రామన్న. కానీ, నాటి పాలనలో సిరిసిల్ల ఒక మారుమూల ప్రాంతం. ఏ మాత్రం అభివృద్ధి లేకుండె. మెట్ట ప్రాంతం కావడంతో సాగు, తాగునీటికి గోసపడేది. యువకులు గల్ఫ్ దేశాలకు వలస పోయిన్రు. ఉపాధి లేక నేతన్నలు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నరు. దశాబ్దాల పాటు పరిస్థితి ఇలానే ఉండేది. 2009లో కేటీఆర్ ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి మా ప్రాంతం అభివృద్ధికి అడుగు పడింది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత పరుగులు పెట్టింది. కేటీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించేలా చేసిండు. నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయినయ్. ప్రాజెక్టులు, చెక్డ్యాంలు కట్టిన్రు. గోదావరి జలాలు వచ్చినయ్. పంటలు మంచిగా పండుతున్నయ్. నేను గతంలో చాలా ఏండ్లు సౌదీ, దుబాయ్ దేశం పోయిన. అక్కడ చాలీచాలని జీతాలతో మస్తు గోసపడ్డ. ఈ ఆరేడేండ్ల సంది ఇక్కడే ఉంటున్న. నేను వరికోత మిషన్ కొనుక్కొని నడుపుతున్న. రామన్న కృషితో మా ప్రాంతం పూర్తిగా మారిపోయింది. పెద్దపెద్ద నగరాలకు సైతం దీటుగా మారింది.
– బుర్రవేణి నాగరాజు, రాచర్ల బొప్పాపూర్ (ఎల్లారెడ్డిపేట మండలం)
మా అమ్మనాన్నలు వ్యవసాయం చేస్తూ మమ్మల్ని చదివించారు. మా అన్నయ్య కారోబార్గా పనిచేస్తున్నడు. నేను 2018లో ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ(ఎంఏ తెలుగు) పూర్తి చేశా. ఆ తర్వాత నుంచి ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా. మొదట కొంతకాలం హైదరాబాద్లో ప్రిపేర్ అయ్యా. అప్పుడు డబ్బులకు చాలా కష్టమైంది. నెలా నెలా రెంట్ కట్టి చదువుకోవడం ఇబ్బందిగా ఉండేది. కానీ ప్రభుత్వోద్యోగాలు ప్రిపేరయ్యే వాళ్ల కోసం మంత్రి కేటీఆర్ సారు సిరిసిల్లలోనే మంచి వసతులు కల్పించారు. రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నిర్మించిన మోడ్రన్ లైబ్రరీలో ఉద్యోగార్థులకు అవసరమయ్యే అన్ని రకాల మెటీరియల్ అందుబాటులో ఉంచారు. నోటిఫికేషన్లు రావడంతో లైబ్రరీ సమయం కూడా పొడిగించారు. దాంతో నేను హైదరాబాద్ నుంచి మా సొంతూరు లింగంపల్లికి వచ్చా. మా ఊరు నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉండె సిరిసిల్లకు అప్ అండ్ డౌన్ చేస్తున్నా. రోజూ గ్రంథాలయానికి వచ్చి ప్రిపేరవుతున్నా. గొప్ప విజన్ ఉన్న నాయకుడు రామన్న.