కలెక్టరేట్ / తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్ 23: జిల్లాకు వచ్చిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్కు టీజీవో, టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. టీజీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాస్రెడ్డితో పాటు పలువురు నాయకులు హైదరాబాద్ నుంచి వస్తున్న ఆయనను మానేరు వంతెన సమీపంలో కలిసి పుష్పగుచ్ఛాలు అందించి, స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆయా సంఘాల నాయకులను ఆలింగనం చేసుకొని, పేరుపేరునా పలుకరించారు. కార్యక్రమంలో టీజీవోల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, టీఎన్జీవోస్ నాయకుడు ముప్పిడి కిరణ్కుమార్, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకుడు రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.