sultanabad | సుల్తానాబాద్ రూరల్, జనవరి 14: గ్రామీణ కళలను ప్రోత్సహించేందుకు ముగ్గుల పోటీలు దోహదపడతాయని మంచరామి సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల సహాయక కార్యదర్శి ఉప్పు లక్ష్మి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచరామి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బుధవారం సర్పంచ్ ఉప్పు లక్ష్మి-తిరుపతి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు.
హరిదాసుల విన్యాసాలు పలువురిని అల్లరించాయి. న్యాయ నిర్ణయితలుగా లక్ష్మణ్, శారద వ్యవహరించారు. అనంతరం విజేతలకు సర్పంచ్ ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు. మొదటి, ద్వితీయ, మూడో బహుమతితో పాటు ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతీ ఒక మహిళకు ప్రోత్సాహ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎగుర్ల శ్రీనివాస్, వార్డు సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అలాగే చిన్న పిల్లలకు కుర్చీల ఆటలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. వీరి తో పాటు మహిళలకు కుర్చీల ఆటలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు.