రాజన్న సిరిసిల్ల, మార్చి 14 (నమస్తే తెలంగాణ): పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేసి నేతన్నలను ఆదుకోవాలని కాంగ్రె స్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. మూతపడ్డ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లు ఇచ్చి నేత కార్మికులకు ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సీఐటీయూ, వపర్లూం వర్క ర్స్ యూనియన్ ఆధ్వర్యం లో గురువారం కొత్తబస్టాం డ్ వద్ద కార్మికులు 24గంటల రిలే దీక్షలు చేపట్టగా, బీఆర్ఎస్ నాయకులు సం ఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆగయ్య మాట్లాడుతూ, నేతన్నలపై కాంగ్రెస్ సర్కారు కక్ష కట్టిందని, ఉపాధి లేక ఆగమైపోతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ సర్కారుకు ఎక్కడ పేరు వస్తుందోనని, కేసీఆర్ పదేండ్ల పాలనలో చేపట్టిన పథకాల పేర్లన్నింటి మార్చివేస్తున్నదన్నారు. బతుకమ్మ చీరలకు సైతం ఇందిరా, ప్రియాంక, సోనియా ఇలా ఏదో ఒక పేరు మార్చి అయినా నేతన్నలకు భరోసా కల్పించాలని కోరారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లు నిరంతరాయంగా మరమగ్గాల పరిశ్రమ నడిపించిందని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ సర్కారు బకాయిలు రూ. 290కోట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నదని మండిపడ్డారు. రాజకీయాలు పక్కన బెట్టి బకాయిలతో పాటు వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. ఇక్కడ టీఎస్టీపీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, నాయకులు పూర్ణచందర్, వెంగల శ్రీనివాస్, పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్, ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేశ్, జిల్లా కార్యదర్శి కోడం రమణ, అబ్బాస్ పాల్గొన్నారు.