కరీంనగర్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున బదిలీలు చేపట్టింది. ఇప్పటికే పలు శాఖల్లో బదిలీలు జరగగా, ఇప్పుడు జడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలు, డీపీవోలను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొందరు అధికారులకు ఉమ్మడి జిల్లా పరిధిలో బదిలీలు కాగా, మరి కొందరిని ఇతర జిల్లాలకు పంపించారు. కరీంనగర్ డీఆర్డీఓగా పనిచేస్తున్న ఎల్ శ్రీలతారెడ్డిని రంగారెడ్డికి, పెద్దపల్లి డీఆర్డీఓగా పనిచేస్తున్న వీ శ్రీధర్ను కరీంనగర్కు బదిలీ చేశారు.
కాగా, ఆదిలాబాద్ జడ్పీలో డిప్యూటీ సీఈఓగా పనిచేస్తున్న ఆర్ రాజేశ్వర్ను పెద్దపల్లి డీఆర్డీఓగా బదిలీ చేశారు. జగిత్యాల డీఆర్డీఓగా పనిచేస్తున్న పీ నరేశ్ను జయశంకర్ భూపాలపల్లికి, వరంగల్ డీఆర్డీఓగా పనిచేస్తున్న ఎం సంపత్రావును జగిత్యాలకు బదిలీ చేశారు. సిరిసిల్లలో డీఆర్డీఓగా పనిచేస్తున్న ఎన్ శ్రీనివాస్ను మాతృ సంస్థ అయిన రెవెన్యూ శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇతని స్థానంలో మంచిర్యాల డీఆర్డీఓ బీ శేషాద్రిని బదిలీ చేశారు. సిరిసిల్లలో అదనపు డీఆర్డీఓగా పనిచేస్తున్న ఎంపీడీఓ సీహెచ్ మదన్మోహన్ను జగిత్యాల అదనపు డీఆర్డీఓగా బదిలీ చేశారు.
కరీంనగర్ జడ్పీ సీఈఓగా పనిచేస్తున్న డిప్యూటీ సీఈఓ టీ పవన్ కుమార్ వరంగల్ డిప్యూటీ సీఈఓగా, పెద్దపల్లి జడ్పీ సీఈఓగా పనిచేస్తున్న ఎం శ్రీనివాస్ కరీంనగర్కు బదిలీ అయ్యారు. మంచిర్యాల జడ్పీ సీఈఓగా పనిచేస్తున్న కే నరేందర్ను పెద్దపల్లికి బదిలీ చేశారు. సిరిసిల్ల జడ్పీ సీఈఓగా పనిచేస్తున్న బీ గౌతంరెడ్డిని జగిత్యాలకు, సిరిసిల్ల జడ్పీ సీఈఓగా హైదరాబాద్లోని టీఎస్ఐఆర్డీ జేడీగా పనిచేస్తున్న ఎం ఉమారాణికి పోస్టింగ్ ఇచ్చారు.
కరీంనగర్ డీపీఓ వీర బుచ్చయ్యను సిరిసిల్లకు, సిరిసిల్ల డీపీఓ ఎనగందుల రవీందర్ను కరీంనగర్కు బదిలీ చేశారు. పెద్దపల్లి డీపీఓ వీ చంద్రమౌళిని భద్రాద్రి కొత్తగూడెంకు, భూపాలపల్లి డీపీఓ లతను పెద్దపల్లికి బదిలీ చేశారు. ఎక్సైజ్ శాఖలో శంషాబాద్ డీపీఈఓగా పనిచేస్తున్న ఏ సత్యనారాయణరావును జగిత్యాలకు, కరీంనగర్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న ఏ విజయ భాస్కర్రెడ్డిని మహబూబ్నగర్కు, హైదరాబాద్లో బ్రేవరేజెస్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న కే వరప్రసాద్ను కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్గా బదిలీ చేశారు.