జ్యోతినగర్, మే 18: ప్రభుత్వ కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలని, ధాన్యం కోనుగోలులో రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ సూచించారు. ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హా ల్లో మంగళవారం జడ్పీ చైర్మన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధాన్యం కొ నుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతి రోజు లారీల కదలికలపై నిఘా ఉంచి సకాలంలో మిల్లుల వద్ద ధాన్యం దింపేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ఆదనపు లారీలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల చొప్పున పరిహారం ఇస్తామని, మొదట విడుత జిల్లాలో 5,790మంది రైతులకు 6,910.02 ఎకరాలకు రూ. 6కోట్ల 91 లక్షలు మంజూరు చేశామన్నారు. రెండో విడుత 17,560 మంది రైతులకు 21వేల 948 ఎకరాలకు పరిహారం కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. రైతుల ఖా తాలో నేరుగా నగదు జమచేస్తామని చెప్పారు. జిల్లాలో త్వరలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్పథకం, డయాగ్నస్టిక్ హబ్ ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు సకాలంలో హజరయ్యే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. మిషన్ భగీరథ కింద ఇంటింటికి తాగునీటి సరఫరా జరుగుతోందని, నీటి సరఫరా ఇబ్బందిగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లను ఏర్పాటుతో సమస్య పరిష్కారించాలన్నారు. జిల్లాలో కంటివెలుగు ద్వారా ఇప్పటివరకు 3.45 లక్షల మందికి కంటి పరీక్షలు చేపట్టగా 83వేల మందికి కంటి అద్దాలు పంపిణీ చేశామన్నారు. ఆ రోగ్య మహిళా కార్యక్రమం ద్వారా జిల్లాలో 1,843 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించగా 134మందిని తదుపరి చికిత్స కోసం రెఫర్ చేశామని అధికారులు వివరించారు.
మన ఊరు మనబడిలో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన పాఠశాల వివరాలను ప్రజలకు వివరిస్తూ అధిక సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు పం పేలా అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ సంగీతా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ప్రతి రోజు హాజరును పర్యవేక్షించాలన్నారు. ధాన్యం కొనుగోలులో వచ్చే చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు.
ధాన్యం సరఫరాలో లారీల కొరత లేకుండా అదనపు లారీల ఏర్పాటుకు కాంట్రాక్టర్తో చర్చిస్తామని, రైలుమిల్లుల వద్ద లారీ అన్లోడ్ చేయకుండా పెండింగ్లో ఉంటే డిప్యూటీ తహసీల్దార్లు, పౌర సరఫరాశాఖల అధికారులు సమన్వయంతో క్షేత్ర స్థాయిలో సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, గతేడాదితో పోలిస్తే 10వేల మెట్రిక్ ట న్నులు అదనంగా కొనుగోలు జరిగిందన్నారు. ఇక నుంచి ప్రతి రోజు పదివేల మెట్రిక్ టన్నుల ధా న్యం కొనుగోలుకు చర్యలు చేపట్టామన్నారు. జూ న్ మొదటి వారం నాటికి నిర్దేశిత లక్ష్యం మేరకు 3.5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ల స్థానంలో విద్యా వలంటీర్ల నియామకానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు.
మన ఊరు మనబడి కిం ద ప్రభుత్వం 67 పాఠశాలల్లో వాచ్మెన్ల నియామకం చేపడుతున్నదని, వారంలో వారు విధుల కు హాజరు కానున్నట్లు జిల్లా విద్యాధికారి తెలిపా రు. జడ్పీటీసీలు మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రాత్రిపూట వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ దవాఖానలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. జిల్లాలో పదోతరగతి ఫలితాల్లో గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించి రాష్ట్రంలోనే 9వ స్థానంలో నిలిచామని, అందుకు కృషి చేసిన కలెక్టర్, అధికారులు, ఉపాధ్యాయులకు సభ్యులు అభినందనలు తెలిపారు. అదనపు కలెక్టర్ దీపక్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్, జడ్పీ సీఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
పెద్దపల్లి జిల్లాలో విద్య, వైద్యంలో ప్రజలకు మెరుగైన సేవలందుతున్నాయి. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయి. మన ఊరు.. మనబడి కింద ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్కు దీటుగా తయారవుతున్నాయి. సీఎం కేసీఆర్కు నా ప్రత్యేక కృతజ్ఞతలు. కంటివెలుగు ద్వారా ఉచిత పరీక్షలు చేయడం గొప్ప విషయం. పదోతరగతి ఫలితాల్లో 92.49 శాతం ఉత్తీర్ణతతో జిల్లాకు రాష్ట్రంలో 9వ స్థా నం రావడం గర్వకారణం. ధాన్యం సరఫరా లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.
– బొద్దుల లక్ష్మణ్, జూలపల్లి జడ్పీటీసీ