Sarangapur | సారంగాపూర్, జూన్ 30 : రక్త నిధిలో ఎల్లప్పుడు తగిన నిల్వలు ఉండాలంటే యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తరచుగా రక్తదానం చేయాలని జగిత్యాల ప్రభుత్వ రక్తనిధి అధికారి ముస్కు మైత్రిరెడ్డి సూచించారు. సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఇండియన్ మెడికల్ అసోషియోషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 16 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మైత్రి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు విస్తృతం అవుతున్న నేపథ్యంలో రోగులకు రక్తం రోజురోజుకు అవసరం పెరుగుతుందన్నారు. జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ వర్షా కాలంలో వైరల్ జ్వరాలు, డెంగ్యూ వంటి వ్యాదులు అధికమయ్యో అవకాశం ఉందని ప్లెట్లెట్స్తో పాటు రక్తం అవసరం కూడా పెరుగుతుందన్నారు.
తరచు రక్తదాన శిబిరాలను నిర్వహించడం అత్యంత అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ శాఖ కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ కోలపాక రాధ-రాజు, పోచంపేట సర్పంచు రెంటం జగదీష్, విండో చైర్మెన్ గురునాథం మల్లా రెడ్డి, ఉప సర్పంచ్ మైదం ప్రభాకర్, నాయకులు ముద్దం శ్రీనివాస్, బొడ్డుపెల్లి శేఖర్, శంకర్, బొక్కల రమేష్, మర్రిపెల్లి శ్రవన్, ముద్దం చిరంజీవి, జోగినీ గంగారెడ్డి, ఏఎన్ఎం నిర్మల, ఆవా వర్కర్లు, రక్త దాతలు తదితరులు పాల్గొన్నారు.