ప్రపంచం గర్వించదగ్గ పథకం దళితబంధు
టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్యాదవ్
జమ్మికుంట రూరల్, ఫిబ్రవరి 25: దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నదని టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన కుమ్మరి మంజుల దళిత బంధు పథకం కింద వచ్చిన డబ్బులతో పేపర్ ప్లేట్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసుకోగా శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు గర్వించదగ్గ పథకం దళిత బంధు అని కొనియాడారు. దళితుల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ముందు బీజేపీ రాష్ట్ర నాయకులు నియోజకవర్గంలో దళిత బంధు పథకంపై అసత్య ప్రచారం చేశారన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకాన్ని వర్తింపజేస్తున్నారని వివరించారు. దళితులకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్కు నియోజకవర్గ దళితుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ దొడ్డె మమత, వైస్ ఎంపీపీ తిరుపతిరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టంగుటూరి రాజ్కుమార్, ఎంపీటీసీ మర్రి మల్లేశం, సర్పంచులు మహేందర్, పద్మారాజేశ్వర్రావు, మండల కో-ఆప్షన్ సభ్యుడు రఫీ, మాజీ ఎంపీటీసీ మహేంద్రచారి, టీఆర్ఎస్వీ నాయకులు తిరుపతి, శ్రీరాం, నాయకులు సతీశ్, మల్లారెడ్డి, సదానందం, సంపత్, సతీశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.