జగిత్యాల రూరల్/ కథలాపూర్/ యైటింక్లయిన్ కాలనీ, సెప్టెంబర్19: కవిత పోరాట ఫలమే మహిళా రిజర్వేషన్ బిల్లు అని సింగరేణి మహిళా ఉద్యోగులు కొనియాడారు. మంగళవారం ఆర్జీ-2 ఏరియా జీఎం కార్యాలయ మహిళా ఉద్యోగులు, జగిత్యాల జిల్లా కథలాపూర్లో ఎంపీపీ జవ్వాజి రేవతి ఆధ్వర్యంలో.. జగిత్యాల రూరల్ మండలకేంద్రం, లక్ష్మీపూర్లో సంబురాలు జరుపుకున్నారు.
‘కవితక్క జిందాబాద్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆమె చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞత చాటారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం కోటాకోసం గళమెత్తిన ఆమె పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.