యువతను సన్మార్గంలో నడిపించి వారిలోని నైపుణ్యం వెలికితీస్తూ వారి బంగారు భవిష్యత్తుకు తెలంగాణ సర్కారు బాటలు వేస్తున్నది. సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా నాయకుల పెత్తనంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక ప్రోత్సాహం కరువై అసాంఘిక కార్యకలాపాలకు ఆకర్షితులై జీవితాలను నాశనం చేసుకున్న రోజులను దూరం చేసి, వారిలోని ప్రతిభా పాటవాలను వెలికితీస్తున్నది. మెరుగైన విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన సర్కారు, మరిన్ని కొలువులకు వెల్లువలా నోటిఫికేషన్లు ఇస్తున్నది. అలాగే, ‘తప్పు చేస్తే.. శిక్ష తప్పదు’ అనే సంకేతాన్నిచ్చి నేరాలను పూర్తిగా నియంత్రించి శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీస్ శాఖను పటిష్టం చేసింది. ఈక్రమంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా యువత కోసం సోమవారం ‘తెలంగాణ రన్’ నిర్వహిస్తున్నది.
– కరీంనగర్, జూన్ 11(నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూన్ 11(నమస్తే తెలంగాణ) స్వరాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ సర్కారు యువత బాగుకు, వారి సంక్షేమం కోసం తపిస్తు న్నది. ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా, ప్రైవేట్లో ముఖ్యంగా ఐటీ రంగంలో అవకాశాల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. 2014కు ముందుతో పోల్చితే గత తొమ్మిదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు మెరుగయ్యా యి. యువత వ్యసనాలకు బానిసకాకుండా విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం వినూ త్న మార్పులు తీసుకువచ్చింది. నిరుపేద విద్యార్థుల కోసం సంక్షేమ హాస్టళ్లు, ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్లు అందిస్తున్నది. ఉద్యోగాల కల్పన కోసం ప్రణాళికతో ముందుకెళ్తున్నది. ముందుగా మన ఉద్యోగాలు మన బిడ్డలకే దక్కాలన్న లక్ష్యం తో సమైక్య రాష్ట్రంలో ఉన్న జోనల్ విధానంలో సీఎం కేసీఆర్ సమూల మార్పులు తెచ్చారు. దీనిపై దాదాపు రెండేళ్లపాటు కేంద్రంతో పోరాడి చివరకు విజయం సాధించారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న జోనల్ విధానం ప్రకారం చూస్తే జిల్లా కేడర్లో 80:20, ఉండేది. అంటే వంద పోస్టులు పడితే అందులో 80 పోస్టులు స్థానికులకు, 20పోస్టులు స్థానికేతర రిజర్వేషన్లగా పరిగణించి భర్తీచేసే వారు. అలాగే జోనల్ కేడర్లో 70:30 శాతం, బహుళ జోన్లో 60:40 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయి.
ఈ విధానంలో ఉన్న లోపాల వల్ల వివిధ క్యాడర్లోని పోస్టులను స్థానికేతరులు తన్నుకుపోయేవారు. ఇందులో ఉన్న లోపాలు.. తద్వారా తెలంగాణ యువతకు జరుగుతున్న నష్టం, మారుమూల జిల్లాలు, మండలాల యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కక పోవడం… ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల విషయంలో శాస్త్రీయత లోపించడం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ పాత జోనల్ విధానాన్ని సమూల ప్రక్షాళన చేశారు. 95 శాతం ఉద్యోగాలు ఈ ప్రాంత బిడ్డలకే దక్కాలన్న ల క్ష్యంతో.. కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా, ఇప్పటికే లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయగా, మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం వెల్లువలా నోటిఫికేషన్లను ఇస్తున్నది. మరోవైపు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు సీఎం కేసీఆర్ సారథ్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ టీఎస్ ఐపాస్ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారింది. ఐటీ కంపెనీలు తరలి వస్తుండగా, యువతకు ఉద్యోగావకాశాలు పెరిగా యి. అవి ప్రస్తుతం మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీలు సైతం హైదరాబాద్ కేంద్రంగా వెలుస్తున్నాయి. జిల్లాల్లో ఉన్న యువతను దృష్టిలో పెట్టుకొని ఐటీ రంగాన్ని కేవలం హైదరాబాద్కే పరిమితం చేయకుండా.. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్నగర్, నల్లగొండ, సిద్దిపేలో ఐటీ టవర్లు నిర్మించి విస్తరించారు. ఇక్కడితో అగకుండా యువతకు సాధ్యమైనంత ఎక్కువగా ఐటీ రంగంలో ఉద్యోగాలువచ్చే చేయాలన్న తపనలో భాగంగా తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జి కేంద్రాలు (టాస్క్) ఏర్పాటు చేసింది.
యువత సన్మార్గంలో నడిచేలా చర్యలు
యువతను సన్మార్గంలో నడిపించేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. సమైక్య రాష్ట్రంలో ఉ పాధి, ఉద్యోగ అవకాశాలు లేక ప్రోత్సాహం కరువై అసాంఘిక కార్యకలాపాలకు అలవాటు పడ్డ వారిని సరైన మార్గంలో పెట్టింది.‘తప్పు చేస్తే.. శిక్ష తప్పదు’ అనే సంకేతాన్నిచ్చి నేరాలను పూర్తిగా నియంత్రించింది. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీసు శాఖను పటిష్టం చేసింది. పోలీసు లు ప్రజల్లో మమేకమయ్యేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం తీసుకువచ్చింది. వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్ల సమయంలో యువతకు కెరీర్ గైడెన్స్ శిక్షణ ఇస్తూ వారు జీవితంలో స్థిరపడేలా అనేక కార్యక్రమాలను నిర్వహించింది. ప్రతీ పేద విద్యార్థికి సైతం నాణ్యమైన శిక్షణ అందేలా గ్రంథాలయాలను బలోపేతం చేసి వాటిల్లో అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచింది. వారికి తర్ఫీదు ఇచ్చి ఉద్యోగ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించేలా ప్రోత్సాహం అందించింది. విద్యతోపాటుగా క్రీడా, సాంస్కృతిక రంగాల్లో సైతం ప్రతి భా వంతులను గుర్తించి వారికి తోడ్పాటునందిస్తున్నది. ఆయా రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకునేలా వెన్ను తట్టింది. దీంతో పల్లెల్లో ఎక్కడ చూసినా ప్రశాంత వాతావరణంలో యువత తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నది.
నేడు 2 కే రన్..
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది దినోత్సవాల్లో భా గంగా సోమవారం అన్ని జిల్లా, నియోజకవర్గ కేం ద్రాల్లో 2 కే రన్ నిర్వహించనున్నారు. ఇందులో మంత్రులు, పోలీసు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, యువకు లు పాల్గొననున్నారు. ఇందుకు ఆయా జిల్లాల్లో యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఎంబీబీఎస్ చేస్తానని ఊహించలేదు
మాది గోదావరిఖనిలోని విఠల్నగర్. నాన్న గోల్డ్ స్మిత్. పాథమిక, ఇంటర్ విద్య ఇక్కడే పూర్తయిం ది. ఎంబీబీఎస్ చదవాలనుకున్నా. నేను పుట్టి పెరిగిన గోదావరిఖనిలోనే ఎంబీబీఎస్ చేస్తానని ఏనాడూ కలలో కూడా అనుకోలేదు. సీఎం కేసీఆర్ సహకారం వల్ల ఇది సాధ్యమైంది. రామగుండంకు కూ డా మెడికల్ కళాశాల వస్తుందని.. రామగుండంలో నే ఎంబీబీఎస్ చేస్తానని అనుకోలె. గోదావరిఖనితో నాకు విడదీయలేని అనుబంధం ఉన్నది. ఆ ఆత్మీయ అనుబంధాల నడుమ నేను ఎంబీబీఎస్ చేస్తున్న. చాలా ఆనందంగా ఉంది.
-ఏలేశ్వరం హరీశ్, ఎంబీబీఎస్ విద్యార్థి, విఠల్నగర్, ఖని (రామగుడం మెడికల్కాలేజీ)
లైబ్రరీలో ప్రిపేరవుతున్న
నేను జేఎల్, గురుకుల ఉ ద్యోగాలకు సిద్ధమవు తున్న. గతంలో కొద్ది మార్కుల తేడాతో జాబ్ మిస్సయింది. అప్పుడు పరీక్షలకు ప్రిపేరయ్యేందు కు సరైన సదుపాయాలు లేవు. కోచింగ్ తీసుకొనే స్థోమతలేక, మంచి మె టీరి యల్లేక ఉద్యోగాన్ని కోల్పోయిన. కానీ ఇ ప్పుడు ప్రభుత్వం స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసింది. గ్రంథాలయాల్లో ప్రిపేరయ్యేవారికి ఏసీతో పాటు సకల సౌకర్యాలు కల్పించింది. మంచి మెటీ రియల్ను అందుబాటులో ఉంచారు. నేను కరీం నగర్ లైబ్రరీలోనే ప్రిపేరవుతున్న. ఉదయం 8 గంటలకు వచ్చి రాత్రి 10 వరకు చదువుకుంటు న్న. మధ్యాహ్నం భోజనం పెడుతున్నరు. మినరల్ వాటర్, సాయంత్రం టీ ఇస్తున్నరు.
– కంచర్ల రజిత, మంకమ్మతోట, కరీంనగర్