సిరిసిల్ల కలెక్టరేట్, జనవరి 5: ప్రభుత్వం రూపొందించిన టీ-నేతన్న యాప్ను కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలని చేనేత, జౌళీశాఖ సహాయ సంచాలకుడు ఎం సాగర్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. టీ-నేతన్న అప్లికేషన్ను జియో ట్యాగింగ్ కలిగి, వృత్తిపై ఆధారపడిన ఆసాములు, అనుబంధ కార్మికులు గూగుల్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
ప్రభుత్వ పథకాల్లో సమస్యలున్నా, పథకాలు అందకపోయినా, ఆయా స్కీమ్లకు ఉన్న అర్హత, తదితర వివరాలను యాప్ ద్వారా తెలుసుకొనే అవకాశం ఉందన్నారు. పథకాల్లో మార్పులు, చేర్పులు జరిగిన వెంటనే ఎస్ఎంఎస్ ద్వారా మెసేజ్లు వస్తాయని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ల వివరాలు ఈ యాప్ను నమోదైన ఆసాములకు మాత్రమే అందిస్తామని తెలిపారు. మరమగ్గాల ఆసాములు, అనుబంధ కార్మికులందరూ టీ-నేతన్న యాప్లో ఈనెల 10లోగా పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు.