సైదాపూర్, నవంబర్ 25: జిల్లాలో ఉన్న ఒకే ఒక్క తండా గ్రామ పంచాయతీ రాయికల్ తండా అ న్నింటా ఆదర్శంగా నిలువాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అభిలషించారు. గురువారం గ్రామంలో పర్యటించి పల్లెప్రగతి పనులను ఆమె పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత బాగుందని పాలకవర్గాన్ని అభినందించారు. వైకుంఠథామం, కంపోస్ట్షెడ్లను సందర్శించారు. అంగన్వాడీ సెం టర్, ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. చిన్నారులకు పౌష్ఠికాహారం పెడుతున్నారా? లేదా? అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ము చ్చటించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామస్తుల తో మాట్లాడారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ను వాడవద్దని, చెత్తను ఆరు బ యట వేయవద్దని గ్రామ పంచాయితీ ట్రాక్టర్లోనే వేయాలని కోరారు. మరుగుదొడ్లను వినియోగించుకోవాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటించడమే గాకుండా అర్హులందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, కడప జిల్లాల నుంచి యూనిసెఫ్ ప్రతినిధులు తండాలోని పరిస్థితుల ఆధ్యయనానికి వచ్చారు. గ్రామ పరిసరాలు, ఇండ్లు, మరుగుదొడ్లు, పల్లెప్రగతి పనులను పరిశీలించారు.
గిరిజనులతో కలిసి నృత్యం
తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే తండాను సందర్శించాలని అనుకున్నానని అదనపు కలెక్టర్ తెలిపారు. ఇక్కడి పరిసరాలు తనకు బాగా నచ్చాయని చెప్పారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తో మాట్లాడారు. వారి కోరిక మేరకు ఫొటో దిగా రు. అనంతరం తండా వాసులు తమ సంప్రదా య నృత్యాన్ని కలెక్టర్ ఎదుట ప్రదర్శించగా వారి తో కలిసి కాసేపు నృత్యం చేశారు. తండాలకు వెళ్లే దారి సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, తండాలో వైకుంఠధామం వద్ద బోరువేయాలని, అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని సర్పంచ్ బర్మావత్ అక్షయాశ్రీనివాస్నాయక్ అదనపు కలెక్టర్ను కోరారు. సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీలతారెడ్డి, హు జూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బర్మావత్ రమాయాదగిరినాయక్, యూనిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్ కిషన్స్వామి, ఎంపీవో రాజశేఖర్రెడ్డి, ఎస్బీఎం రమేశ్, అతిమ ఎన్జీవో ప్రతినిధి దీప్తి, హుజూరాబాద్ కౌన్సిలర్ బర్మావత్ యాదగిరినాయక్, దిశ కమిటీ సభ్యులు బర్మావత్ శ్రీనివాస్నాయక్ తదితరులు ఉన్నారు.