ప్రాపర్టీ షో గ్రాండ్ సక్సెస్ అయింది. ఆదివారం రెండోరోజు దిగ్విజయంగా ముగిసింది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టూ డే’ సంయుక్తంగా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్ వేదికగా నిర్వహించిన ఎక్స్పోకు ఉమ్మడి జిల్లా ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలతోపాటు, కరీంనగర్లోని పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, బ్యాంకులు పాల్గొనగా, పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. తమ సూచనలు, సలహాలు ఇచ్చారు.
– కమాన్చౌరస్తా/ కార్పొరేషన్, నవంబర్ 27
కరీంనగర్లో రెండ్రోజుల పాటు ప్రాపర్టీ షో నిర్వహించడం అభినందనీయం. ఇలాంటి ఎక్స్పోలతోనే స్థిరాస్థులు కొనాలనుకొనే వారికి అవగాహన ఏర్పడుతుంది. ఏయే ప్రాంతాల్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయడంతో పాటు కన్స్ట్రక్షన్లో వస్తున్న నూతన ఒరవడులు తెలుసుకోవచ్చు. ఇలాంటి షోలకు వచ్చే సంస్థలు నిబంధనలు తప్పకుండా పాటిస్తాయి. బ్యాంకర్లనూ భాగస్వామ్యం చేయడంతో లోన్లు, ఇతరత్రా సమాచారం సులువుగా తెలుసుకోవచ్చు.
– చెట్టి సంపత్, ఎస్బీఐ మేనేజర్, వావిలాలపల్లి
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రాపర్టీ షోకు స్పందన బాగుంది. అన్ని వర్గాలకు ఉపయోగ పడేలా ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, నివాస గృహాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కరీంనగర్ ఉండడంతో ఇక్కడ కొనుగోళ్లు ఎక్కువగా చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిస్తూ, పర్మిషన్లు, రిజిస్ట్రేషన్ కాగితాల విషయంలో పక్కాగా ఉండాలి.
– వాసిరెడ్డి శ్రీధర్, డీఏవో (కరీంనగర్)
నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం మంచి అవకాశం. దీని ద్వారా ఒక్కరోజే 40 నుంచి 50 మందికి సేవలందించాం. లోన్లు, డిపాజిట్లకు సంబంధించి పలు అనుమానాలను నివృత్తి చేశాం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యామనే భావన వచ్చింది. ఇలాంటివి మరిన్ని నిర్వహించినా మేం ముందుండి సహకారం అందిస్తాం.
– రవి శంకర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ఎం)
ఒకే వేదికపై అన్ని రకాల ప్రాపర్టీలు, అవి కొనుగోలు చేయడానికి రుణాల కోసం బ్యాంకులు ఏర్పాటు చేయడం మంచి అంశం. అమ్మేవారు, కొనేవారు భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక, న్యాయపరమైన ఇబ్బందులు ఉండకుండా చూసుకోవాలి. మున్సిపల్ ఆధ్వర్యంలో అవసరమైన పర్మిషన్లు సకాలంలో మంజూరు చేస్తున్నాం. సద్వినియోగం చేసుకుని ప్రభుత్వానికి సహకారం అందించాలి.
– సేవా ఇస్లావత్, మున్సిపల్ కమిషనర్ (కరీంనగర్)
కమర్షియల్ బ్యాంకులతో సమానంగా గృహ రుణాలను మేం అందిస్తున్నాం. అందులో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో ద్వారా ఎక్కువ మందకి చేరువయ్యామనే నమ్మకం వచ్చింది. మేం అందిస్తున్న రుణాలను సులభతరంగా పొందేందుకు పలువురు కస్టమర్ల సందేహాలు నివృత్తి చేశాం. ఈ షో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉన్నది.
– భరత్, మేనేజర్, రెప్కో హోం ఫైనాన్స్
నిర్మాణ రంగంలో దిగ్గజాలైన పలు సంస్థలు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షోలో భాగమయ్యాయి. ఆర్థికంగా, వ్యాపార పరంగా అభివృద్ధి చెందతున్న కరీంనగర్కు ఇది మంచి అవకాశంగా అనిపిస్తున్నది. స్థానికంగా కూడా పలు సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలతో, విలాసవంతమైన విల్లాలు కూడా నిర్మిస్తూ ఈ ప్రదర్శనలో తమ ప్రాపర్టీలు ప్రజల ముందుకు తీసుకువచ్చాయి. ఇది మంచి అంశం.
– సేవ్యానాయక్, లాండ్ సర్వే ఏడీ
నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు జనాధరణ ఎక్కువగా ఉన్నది. సోలార్ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. సోలాప్ ఉత్పత్తులను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది మాకు వచ్చిన మంచి అవకాశంగా భావిస్తున్నాం.
– భవాణి, కేకే ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు
నాణ్యమైన కట్టడాలు చేపడుతున్న ఆదర్శ కంఫర్ట్స్ సంస్థతో తమ సొంతింటి కల నెరవేర్చుకు నేందుకు ఎక్కువ సంఖ్యలో జనం ఆసక్తి చూపుతున్నారు. మా వద్ద 1500ల ఎస్ఎఫ్టీ నుంచి 2550 ఎస్ఎఫ్టీ వరకు కట్టడాలు అందుబాటులో ఉన్నాయి. కొనుగోలుదారులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. స్టాల్ వద్దకు వచ్చిన వారు నిర్మాణాల గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ఈ షో మాకు ఎంతో ఉపయోగపడింది.
– రాజన్న, ఆదర్శ కంఫర్ట్స్