వేములవాడ రూరల్, మే 27 : వేములవాడ మండలం అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ఉత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందుకు కళాశాలకు ఎన్బీఏ (ది నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్) గుర్తింపు దక్కింది. శ్రీరాజరాజేశ్వర స్వామి పాలిటెక్నిక్ కాలేజీ 1979లో వేములవాడ మండలం అగ్రహారంలో ఏర్పాటైంది. ఎన్నో అవార్డులతోపాటు కళాశాలకు మంచి గుర్తింపు లభించింది. రాష్ట్రస్థాయిలో మం చి పేరు సంపాదించింది. అలాగే ఇటీవల ఎన్బీఏ ఢిల్లీ బృందం నిపుణులు మార్చి 24 నుంచి 26 వరకు కళాశాలను సందర్శించారు.
కళాశాల వాతావారణం, మౌలిక వసతులు, ప్రయోగశాలలు, విద్యాబోధన, బాలురు, బాలికల హాస్టల్స్ను క్షుణ్ణంగా పరిశీలించారు. బోధన వసతులు, విద్యాప్రమాణాలు, నిర్వహణ, విద్యార్థుల ప్రవేశాలు, ఉత్తీర్ణతశాతం, ఉద్యోగకల్పన, ప్రాంగణ నియామకాలు, ఉన్నత విద్యా సంస్థలో చేరికలు, సహ అదనపు బోధన ప్రణాళికలు, టాస్క్ శిక్షణ కార్యక్రమాలు, కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అం దిస్తున్న సహాయ సహకారాలు మొదలైన అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించి, ఉత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందుకు కళాశాలకు ఉత్తమ జాతీయస్థాయి గుర్తింపు ఇచ్చారు. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్ రాజగోపాల్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్బీఏ గుర్తింపుతో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ప్రభుత్వ సంస్థల పరిశోధన, ప్రాజెక్టులు మంజూరు చేసే అవకాశం పెరుగుతుందని, కొత్త కోర్సులను ప్రారంభించే వీలుంటుందని చెప్పారు.